ఇమాం హుసైన్[అ.స] ల వారి రాయబారి అయినటువంటి ముస్లిం బిన్ అఖీల్ ల వారి గురించి సంక్షిప్తంగా.
ముస్లిం ఇబ్నె అఖీల్ ఇమాం హుస్సైన్[అ.స] ల వారి పిన తండ్రి అయిన అఖీల్ ఇబ్నె అబీతాలిబ్ ల వారి కుమారులు మరియు ఇమాం హుసైన్[అ.స] ల వారి రాయబారి.ముస్లిం యొక్క పుట్టిన తేదీ గురించి ఎవరికీ తెలియదు కానీ వారు జిల్ హజ్జ్ యొక్క 9వ తారీకున కూఫాలో వీరమరణాన్ని పొందారు.కొన్ని హదీసులు వారు ఇమాం అలి[అ.స] ల వారి తరపున సిఫ్ఫీన్ యొక్క యుద్ధంలో పాల్గొన్నారని చెబుతున్నాయి. ముస్లిం యొక్క వివాహం ఇమాం అలి[అ.స] ల వారి కుమార్తె అయిన “రుఖయ్యా” తో జరిగింది. చరిత్ర యొక్క కొన్ని పుస్తకాలలో వారికి ఇద్దరు కుమారులు [ముహామ్మద్ మరియు ఇబ్రాహీం] అని,మరి కొన్ని పుస్తకాలలో వారి కుమారులలో ఇబ్రాహీం,అలి,అబ్దుల్ అజీజ్,ముస్లిం ల పేర్లను కుమార్తెలలో హమీద లేదా ఉమ్మె హమీదా పేర్లను ప్రస్థావించటం జరిగింది. ఇమాం హుసైన్[అ.స] ల వారి రాయబారిగా కూఫా వెళ్ళడానికి ముందు వారి జీవిత సంఘటనలు ఎక్కడా ప్రస్థావించబడలేదు.కొన్ని పుస్థకాలలో మాత్రం వారు తమ సోదరులైనటువంటి జాఫర్,అలి ల తో పాటు దక్షిణ ఆఫ్రికా యొక్క బెహెన్సా పట్టణాన్ని ఆక్రమించుకోవడంలో పాల్గొన్నారని చరిత్ర చెబుతుంది. ఇమాం హుసైన్[అ.స] మదీనా విడిచి మక్కాకు వెళుతున్నప్పుడు ముస్లిం ఇబ్నె అఖీల్ ఇమాం ల వారితోనే ఉన్నారు.ఆ తరువాత ఇమాం హుసైన్[అ.స] ల వారి ఆదేశం మెరకు కూఫా నగరం యొక్క పరిస్థితులను కచ్చితంగా తెలుసుకోవటానికి వారు కూఫా కు వెళ్ళటం జరిగింది.ఆ తరువాత విధేయత లేని కూఫా వాసుల పిరికితనానికి వారు బలైపోయారు.ఉబైదుల్లహ్ ఇబ్నె జియాద్ ఆదేశాల మెరకు వారి తలను నరికి యజీబ్ ఇబ్నె మావియా ముందు హాజరుపరచటం జరిగింది.వారిని మస్జిదే కూఫా యొక్క తూర్పు భాగాన ఖననం చేయటం జరిగింది.
రెఫరెన్స్: చెహ్రెహాయి దర్ హిమాసయె కర్బలా,పూర్ అమీని,పేజీ నం:167,తారీఖుల్ ఉమం వల్ ములూక్,తబరి,పేజీ 1వ భాగం,పేజీ నం:397.
వ్యాఖ్యానించండి