మానవుడు తన జీవితం గడపడాన్ని తప్పకుండా ఒక ధర్మాన్ని అనుసరించాలి, అయితే వారి కోసం నిజమైన ధర్మం యొక్క సంకేతాల వివరణ సంక్షిప్తంగా...
మానవుడు ఒక ధర్మాన్ని ఆచరించి తన జీవితాన్ని గడపడం అవసరం. కాని మన లోకంలో ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఏ ధర్మాన్ని ఆచరించాలో సాధారణ స్వభావం కలిగివున్న వారికి తెలియదు. వారి కోసం ఇక్కడ నిజమైన ధర్మం యొక్క సంకేతాలను వివరిస్తున్నాము:
1. నిజమైన ధర్మం, బుద్ధివివేకాలకు అనుకూలంగా ఉంటుంది
విగ్రాహారాధనలు చేసేవారు రాయి మరియు చెక్కలను విగ్రహాలుగా చెక్కి వాటిని పూజించేవారు. ఖుర్ఆన్ ఇలా సూచిస్తుంది: వారితో అతనిలా అన్నాడు: “ఏమిటి? మీరు (మీ స్వహస్తాలతో) చెక్కిన శిలలను పూజిస్తారా?”[సూరయె సాఫ్ఫాత్, ఆయత్95]
ఈ మిథ్యమార్గాన్ని బహుశ మా పూర్వీకులు కూడా అనుచరించి ఉండవచ్చు, కాని మేము వారి అడుగుజాడలలో నడిచి అదే మార్గంపై నడవకూడదు; ఎందుకంటే విగ్రాహారధకులు తాము చేసిన కార్యానికి సాకుగా ఇలా అనేవారు: “మేము మా తాతముత్తాతలను ఒక పద్ధతిపై ఉండటం చూశాము. మేము కూడా వారి పాదచిహ్నాలలోనే నడుస్తాము”[సూరయె జుఖ్రుఫ్, ఆయత్23]
2. నిజమైన ధర్మం, సృష్టికర్త తరపు నుంచి నియమించబడి ఉండాలి ఇతరుల తరపు నుంచి కాదు
ఈ ఉదాహారణను గమనించండి; ఒక కంపెనీ నుంచి తయారు అయి బజారులో ప్రవేశబెట్టే ప్రతీ పరికరం మరియు సాధనంతో పాటు సాధారణంగా Manual ఉంటుంది. ఆ పరికరాన్ని ఎలా ఉపయోగించాలో అందులో వివరించబడి ఉంటుంది.
మానవులు కూడా అల్లాహ్ యొక్క సృష్టి, అల్లాహ్ ద్వార అవతరింపబడిన ఆకాశగ్రంథం రూపంలో వారి మార్గదర్శకం కోసం కూడా Manual ఉంది. ఒక పరికరాన్ని డిజైన్ చేసిన వారే దాని Manual కూడా లిఖించినట్లు, మన జీవన విధానం యొక్క ప్రణాలిక కూడా మనల్ని సృష్టించిన, మన అవసరాలు బాగా తెలిసిన మరియు కష్టాలను దూరం చేసే శక్తి కలిగివున్న ఆ అల్లాహ్ యే ఇవ్వాలి.
3. నిజమైన ధర్మం, మానవుల అవసరాలన్నింటిని తీర్చే ప్రణాళిక కలిగి ఉండాలి; దేహఆత్మల పరంగా, ఇహపరలోకాల పరంగా, వ్యక్తీ మరియు సమాజ పరంగా.
4. నిజమైన ధర్మం, దాని అనుచరణ వల్ల మనిషిలో సమర్థత, అభివృద్ధి పొందాలి. కాలం గడిచే కొద్ది అది పాతపడిపోకూడదు, దాని ఆదేశాలు నిత్యం తాజాగా మరియు ఆకర్షనియమైనవిగా ఉండాలి.
ధర్మం యొక్క ఆదేశాలు ఉదాహారణకు అల్లాహ్ ఆరాధన, పవిత్రుల పట్ల విధేయత, ప్రజల హక్కుల పట్ల శ్రద్ధ, మంచి ఆహారం, శుభ్రత, శిక్షణ, విద్యాభ్యాసం, పని, ఇతరుల పట్ల గౌరవం, బలహీనులకు సహాయం చేయడం..., వీటిలో ఆ ఒక్క ఆదేశం ఒక ప్రత్యేక కాలం మరియు స్థలానికి ప్రత్యేకించబడినవి కావు, ఇవి నిత్యం ప్రతీ కాలం మరియు ప్రతీ ప్రదేశంలో ఉంటాయి.
అంతిమ దైవప్రవక్త అయిన హజ్రత్ ముహమ్మద్(స.అ) యొక్క మనవడు హజ్రత్ ఇమామ్ హుసైన్(అ.స) ఇలా ప్రవచించారు: “ఎట్టి పరిస్థితిలోనూ అవమానాన్ని స్వీకరించను, నేనూ మరియు నా సంతానం చంపబడినా సరే” ఈ శ్లోకం అన్ని కాలాలలో అన్ని ప్రదేశాలలో మరియు మానవులందరికీ నచ్చేటువంటి శ్లోకం. ఇది పాతది కానటువంటి శ్లోకం.
ధర్మపరంగా నడుచుకొనివారు మరియు ధర్మాన్ని అనుచరించని వారికి రెండు మార్గలు మాత్రమే ఉన్నాయి:
మొదటిది: వారు తమ ఆలోచన మరియు పద్ధతుల పట్ల నడుచుకుంటారు, దీంతో వారు ఎప్పుడోకప్పుడు పశ్చాత్తాపానికీ, చింతకు గురి అవుతారు.
రెండవది: మానవుల ద్వార నియమించబడ్డ చట్టాన్ని నమ్ముతారు, ఇలాంటి చట్టాలు కొంత పరిమిత వ్యక్తుల ద్వార లేదా మనోవాంఛల లేదా దుర్మార్గుల ఆలోచనల నుంచి వస్తాయి.
ప్రతీ కొద్ది సంవత్సరాల తరువాత మానవులు చేత నియమించబడ్డ చట్టాలు మారుతుండం గమనిస్తూ ఉంటాము. ఇలా మారడమే మానవుల చేత నియమించబడ్డ చట్టాలలో లోపాలు ఉన్నాయని మరియు వాటి ద్వార మనిషి సృష్టి లక్ష్యాన్ని చేరుకోలేమని తెలుస్తుంది.
ఖుర్ఆన్ ఇలా ఉపదేశిస్తుంది: “చట్టం, అల్లాహ్ తరపు నుంచి ఒకవేళ ఇతను(ముహమ్మద్-స.అ) గనక ఏదైనా విషయాన్ని కల్పించి మాకు ఆపాదించి ఉంటే, మేమితని కంఠనాళాన్ని కోసి వేసేవారం”[సూరయె హాఖ్ఖహ్, ఆయత్44,46][1]
రిఫరెన్స్
1. ఆష్నాయీ బా ఇస్లాం బరాయె నౌజవానాన్, మొహ్సిన్ ఖిరాఅతీ, మర్కజె తహ్ఖీఖాతె రాయానయి ఖాయిమియహ్ ఇస్ఫెహాన్, పేజీ15.
వ్యాఖ్యానించండి