ఇమామ్ అలీ మరియు ఇమామ్ రిజా అలైహిమస్సలామ్ దృష్టిలో నమాజ్ ప్రాముఖ్యత...
సాయిబీన్ అను వర్గం, దీని పేరు ఖుర్ఆన్ లో కూడా సూచించబడి ఉంది. వీరు హజ్రత్ యహ్యా ను నమ్ముతారు మరియు నక్షత్ర ప్రభావాలను నమ్ముతారు. నమాజ్ మరియు ప్రత్యేక వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఇప్పటికి కూడా వారికి సంబంధిచిన ఒక సంఘం ఇరాన్ లో ఉన్న ఖూజిస్తాన్ ప్రదేశంలో ఉన్నారు. ఈ వర్గ నాయకుడు మరియు పండితుడు కాని అంహకారి ఎన్నో సార్లు ఇమామ్ రిజా(అ.స) తో చర్చలు జరిపాడు కాని లొంగలేదు.
ఒకరోజు ఒక సభలో వారు ఆధారాలనూ, నిదర్శనలను ప్రకటించారు, దాంతో అతడి హృదయం కరిగిపోయి ఇలా అన్నాడు.. ఇప్పుడు నా ఆత్మ సున్నితమైయ్యింది నేను మీ ధర్మాన్ని స్వీకరించాలనుకుంటున్నాను. ఇంతలో అజాన్ వినబడింది, ఇమామ్ రిజా(అ.స) సభను విడిచి వెళ్ళడానికి లేచినిలబడ్డారు. ప్రజలు ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు అని అన్నారు. దానికి ఇమామ్, ముందు నమాజ్ (ఆ తరువాతే అన్నీ) అని అన్నారు. ఇమామ్ యొక్క ఈ క్రమ శిక్షణ మరియు అనుచరణలో వారి న్యాయాన్ని చూసి అతడు ఇంకా ముగ్దుడయ్యాడు. నమాజ్ తరువాత చర్చను పూర్తి చేసి విశ్వాసిగా మారాడు.[1]
యుద్ధం మధ్యలో నమాజ్
ఇబ్నె అబ్బాస్ కథనం ప్రకారం: హజ్రత్ అలీ(అ.స) యుద్ధం మధ్యలో ఆకాశం వైపు చూస్తున్నారు. ఒకడు ముందుకొచ్చి ఇలా ప్రశ్నించాడు: మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? దానికి అలీ ఇలా సమాధానమిచ్చారు: “నమాజ్ యొక్క అగ్ర సమయం వొదులుకోకుడదని” ఇప్పుడు మీరు యుద్ధం మధ్యలో ఉన్నారు. ఆరంభ సమయపు నమాజ్ ను ఎప్పుడూ ఒదులుకోకూడదు, అది యుద్ధ భూమిలో ఉన్నా సరే.[2]
రిఫరెన్స్
1. మొహమ్మద్ బాఖిర్, మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం49, పేజీ175.
2. షేఖ్ అబ్బాసె ఖుమ్మీ, సఫీనతుల్ బిహార్, భాగం2, పేజీ44.
వ్యాఖ్యానించండి