.దైవప్రవక్త[స.అ] తన ఖలీఫా మరియు ఉత్తరాధికారి ఎన్నిక సమస్యను ప్రజల సలహామండలి పై వదిలి వెళ్ళిపోయారా లేదా ఎవరినైన నిశ్చయించి వెళ్ళారా!
ముస్లిములలో ఒక వర్గం యొక్క విశ్వాసం ప్రకారం దైవప్రవక్త[స.అ] (తన మరణాంతరం) ఎవ్వరి ఖిలాఫత్ పై వారి స్పష్టమైన ఆదేశం లేదు, దైవప్రవక్త[స.అ] ఖలీఫా మరియు ఉత్తరాధికారి ఎన్నిక సమస్యను ప్రజల సలహామండలి పై వదిలి వెళ్ళిపోయారు, ఆ సలహామండలి ఇష్టంవచ్చిన వారిని ఎన్నుకోగలదని, నమ్ముతారు. మరి దైవప్రవక్త(స.అ) మరణించిన రోజు నుండి ఈనాటి వరకు దానినే నమ్ముతూ వచ్చారు.
వారు విశ్వాసించే ఈ నమ్మకాన్ని శాయశక్తులా కాపాడుకొని, దాని పై అమలు చేయాలి, అని అనుకుందాం!. కాని పరిశోధన వల్ల మనకు తెలిసేదేమిటంటే వారు నిరంతరం తమ విశ్వాసాలకు వ్యతిరేకంగా అమలు చేసినట్లే ఈ విషయంలో కూడా వ్యతిరేకంగా అమలు చేశారు. ఒకవేళ దైవప్రవక్త[స.అ] యొక్క మొదటి ఖలీఫా బైఅత్ సంఘటనను వదిలేసినా స్వయంగా మొదటి ఖలీఫాయే తన మరణానికి ముందు తన మిత్రుడిని రెండవ ఖలీఫాగా నియమించారు. మరి అలాగే మూడవ ఖలీఫా విషయంలో జరిగింది. ఆ తరువాత “ముఆవియా” తన కుమారుడు “యజీద్”
ను ఆ తరువాత “యజీద్” తన కుమారుడు “ముఆవియా”ను తన ఖలీఫాగా నియమించాడు.
అలా ప్రతీ ఖలీఫా తన కుమారుడుని లేదా తన సోదరుడిని లేదా తన బంధువులను తన ఖలీఫాగా నియమించేవాడు. బనీఅబ్బాస్
లకు ఖిలాఫత్ దక్కిన రోజు నుండి అధికారం వాళ్ళ చేతులలో ఉన్నంతకాలం వాళ్ళు కూడా దీనినే ఆచరించారు. అలాగే ఆ తరువాత ఉస్మానీయుల అధికారంలో కూడా ఖిలాఫత్ వారసులకే దక్కేది.
అంటే దైవప్రవక్త[స.అ] ఖలీఫా ఎన్నికను సలహామండలియే నియమిస్తుంది అని నమ్మినవారు. మొదటి ఖలీఫా రెండవ ఖలీఫాను, రెండవ ఖలీఫా మూడవ ఖలీఫాను అలాగే చివరి వరకు.., ఎందుకు ఖలీఫాలు తమ తరువాత ఖలీఫాను ఎన్నుకున్నారు. ఈ విధంగా చూసినట్లైతే వారు దైవప్రవక్త[స.అ] సున్నత్ ను వ్యతిరేకించారు.
కాని ముస్లిములలో మరో వర్గం ఉంది. వారు దైవప్రవక్త[స.అ], హజ్రత్ అలీ[అ.స]ను తమ ఖలీఫాగా నిశ్చయించారు అని నమ్ముతారు.
ఆలోచించండి!.
వ్యాఖ్యానించండి