ఇమామ్ హుసైన్[అ.స] మానవత్వ విలువలను రక్షించడానికి యుద్ధం చేశారు.
ఇమామ్ హుసైన్[అ.స] దైవప్రవక్త[స.అ] యొక్క మూడవ ఉత్తరాధికారి. తండ్రి అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స], తల్లి ఫాతిమ బింతె ముహమ్మద్[అ.స]. షాబాన్ నెల 3వ తారీఖు, హిజ్రీ యొక్క 4వ ఏట మదీనహ్ పట్టణంలో జన్మించారు. ముహర్రం నెల 10 వ తారీఖు, హిజ్రీ యొక్క 61వ ఏట కర్బలా(ఇరాఖ్) యుధ్ధభూమిలో మానవత్వ విలువల రక్షణ కోసం శత్రువులతో యుద్ధం చేసి వీరమరణం పొందారు.
ఇమామ్ హసన్[అ.స] తన జీవితకాలంలో ముఆవియాతో సంధీ చేశారు అందులో అతిముఖ్యమైన షరత్తు “ముఆవియా మరణాంతరం ఖిలాఫత్(పదవి), ఇమామ్ అలీ[అ.స] యొక్క వారసులకే చెందెను”. మరి ఇమామ్ హసన్[అ.స] 50వ హిజ్రీలో మరణించడం వల్ల వాస్తవానికి ఆ ఖిలాఫత్ పదవి ఇమామ్ హుసైన్[అ.స]కు దక్కాలి కాని ముఆవియా తన జీవితంలోనే తన తరువాత యజీదే ఖలీఫాగా ప్రచారం చేసుకున్నాడు. కాని ఇమామ్ హుసైన్[అ.స] అతడి బైఅత్
ను అంగీకరించలేదు. [ముంతహల్ ఆమాల్, ఇమామ్ హుసైన్[అ.స]కు సంబంధించిన అధ్యాయంలో]
రిఫ్రెన్స్
షేక్ అబ్బాస్ ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, ఇమామ్ హుసైన్[అ.స]కు సంబంధించిన అధ్యాయంలో.
వ్యాఖ్యానించండి