ఆయతుల్లాహ్ సీస్తానీ(అల్లాహ్ అతనిని కాపాడుగాక) యొక్క తౌజీహుల్ మసాయిల్ లో చెప్పబడిన ఫత్వా ప్రకారం జనాబత్ సమయంలో నిషేదించబడిన అంశాలు.
మనిషి జనాబత్ స్థితిలో ఉన్నప్పుడు ఐదు అంశాలు అతడి పై హరామ్ గా నిర్ధారించబడ్డాయి. అవి:
1. శరీరం యొక్క ఏ భాగంతోనైనా సరే ఖుర్ఆన్ అక్షరాలను లేదా అల్లాహ్ పేరు అది ఏ భాషలో ఉన్న సరే, తాకకూడదు; అలాగే దైవప్రవక్తల, ఇమాముల మరియు హజ్రత్ ఫాతెమా జహ్రా[అ.స] పేర్లును కూడా తాకకూడదు.
2. మస్జిదుల్ హరామ్ మరియు మస్జిదున్నబీలో ప్రవేశించడం. అది కేవలం ఒక ద్వారము నుండి వెళ్ళి మరోద్వారము నుండి బయటికి వెళ్ళే సమయం అయినా సరే.
3. ఇతర మస్జిదులలో నిలబడడం, కాని ఇతర మస్జిదులలో ఒక ద్వారం నుండి వెళ్ళి మరో ద్వారం నుండి బయటకు వెళ్ళవచ్చు అది నిషేదించబడలేదు. అలాగే ఇమాముల్ హరమ్ లలో కూడా.
4. ఏదైనా తీసుకోవడానికి లేదా పెట్టడానికి మస్జిదులో ప్రవేశించడం; స్వయంగా అతడు మస్జిదులో ప్రవేశించకపోయినా సరే.
5. వాజిబ్ సజ్దహ్ లు ఉన్న ఆయత్ల ను చదవడం. 1. సూరయే సజ్దహ్, ఆయత్ 15; 2. సూరయే ఫుస్సిలత్, ఆయత్ 37; 3. సూరయే నజ్మ్, ఆయత్ 62; 4. సూరయే అలఖ్, 19.[తౌజీహుల్ మజాయిల్, పేజీ73]
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి