దైవప్రవక్త[స.అ] దృష్టిలో మనోవాంఛలతో చేసే యుద్ధం శత్రుసైన్యంతో చేసే యుద్ధం కన్న పెద్ద యొద్ధం, ఆ మహా సంగ్రామంలో జయించినవాడే నిజమైన విజయవంతుడు...
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: దైవప్రవక్త[స.అ] ఒక సైన్య సమూహాన్ని అవిశ్వాసులతో యుద్ధానికి పంపారు, వారు (విజయాన్ని తమ సొంతం చేసుకొని) తిరిగి వచ్చినప్పుడు దైవప్రవక్త[స.అ] ఇలా అన్నారు: మర్హబా! చిన్న యుద్ధం పూర్తి చేసుకొచ్చిన వారికి, ఇక వారిపై మహాయుద్ధం మిగిలి ఉంది: “యా రసూలల్లాహ్! ఆ పెద్ద యుద్దం ఏమిటి?” అని ప్రశ్నించారు. దైవప్రవక్త[స.అ] “అది మనోవాంఛలతో, మన ఆత్మతో చేసే యుద్ధం” అని సెలవిచ్చారు.[జిహాద్దున్ నఫ్స్ వసాయిల్ అల్ షియా, పేజీ3]
నిజానికి మనోవాంఛలతో యుద్దం చాలా పెద్ద యుద్ధం; ఎందుకంటే సులువుగా పోరాడి గెలుద్దాం అనుకుంటే శత్రువు ఎదురుగా లేడు, మనం పోరాడేది కనబడిని శత్రువుతో. ఆ శత్రువును ఓడించడం ఒక ఎత్తు అయితే దాన్ని గుర్తుపట్టడం మరో ఎత్తు. ఆ శత్రువును ఓడించినప్పుడే తాజాగా మనిషి అల్లాహ్ కు చేరే మార్గాన్ని పొందుతాడు. కాని ఖేదించదగ్గ విషయమేమిటంటే మనం ఈ ప్రాపంచిక అందచందాలలో మునిగిపోయి మనలో ఉన్న ఆ శత్రువును ఓడించే ప్రయత్నం చేయకపోవడమే కాకుండా దాంతో సహవాసం చేస్తూ కూర్చున్నాము. ఇలాంటి వారు ఇహపరలోకాలలో నష్టానికి గురి అవుతారు.
అల్లాహ్ మనందరికి జిహాదె అక్బర్(పెద్ద యుద్ధం)లో విజయాన్ని ప్రసాదించుగాక!.
రిఫ్రెన్స్
షేఖ్ హుర్రె ఆములీ, తర్జుమా సెహ్హత్ అలీ, జిహాదున్ నఫ్స్ వసాయిల్ అల్ షియా, ఇంతెషారాతె నాస్, తెహ్రాన్, 1364షమ్సీ.
వ్యాఖ్యానించండి