అంతిమ ప్రవక్త ఎవరు మరియు వారి ప్రతిష్ఠతా స్థానం గురించి సంక్షిప్త వివరణ...
అల్లాహ్ ఒక లక్షా ఇరవై నాలుగు వేల ప్రవక్తల నుండి మూడు వందల పదమూడు మందిని రసూల్ గా నిర్ధారించెను. ఆ మూడు వందల పదమూడు ప్రవక్తల నుండి ఐదుగురు ప్రవక్తలను “ఉలుల్ అజ్మ్” ప్రవక్తలగా నిర్ధారించెను. ప్రతీ “ఉలుల్ అజ్మ్” రసూల్ కు అల్లాహ్ పవిత్ర గ్రంథం మరియు షరీఅత్ ఇచ్చి పంపించెను.
రసూల్ గా నిర్ధారించబడ్డ ప్రవక్త నబీగా నిర్ధారించబడ్డ ప్రవక్త పై ప్రతిష్ఠత కలిగి ఉంటాడు. అలాగే ఉలుల్ అజ్మ్ పైగంబర్లుగా నిర్ధారించబడ్డ ప్రవక్త రసూల్ గా నిర్ధారించబడ్డ ప్రవక్త పై ప్రతిష్ఠత కలిగి ఉంటాడు. వారందరి పై మన ప్రవక్త హజ్రత్ ముహమ్మద్[స.అ] ప్రతిష్ఠత గలవారు.
మన ప్రవక్తకు అల్లాహ్ ప్రళయదినం వరకు మిగిలి ఉండే ఖుర్ఆన్ లాంటి గొప్ప గ్రంథాన్ని ప్రసాదించాడు. ఇహపరలోకాలకు సంబంధించిన మంచి చెడ్డల గురించి ఉపదేశించేటువంటి ఇస్లాం మతాన్ని ప్రసాదించాడు. అహ్లెబైత్[అ.స] లాంటి మంచి కుటుంబ సభ్యులను ప్రసాదించాడు, మరి వారు మన దైవప్రవక్త[స.అ] తరువాత మానవులందరిలో ఉత్తములు.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.
వ్యాఖ్యానించండి