మదీనాలో యజీద్ గవర్నరైన వలీద్ మరియు ఇమాం హుసైన్[అ.స] ల వారి మధ్య జరిగిన సంభాషణ.
ఇమాం హుసైన్[అ.స] ల వారు చెప్పినట్లుగానే వలీద్ బిన్ అత్బా ఇమాంల వారికి మావియ మరణవార్తను వినిపించి దానితో పాటు యజీద్ యొక్క బైఅత్ మాటను ప్రస్థావించాడు. దానికి ఇమాం హుసైన్[అ.స]ల వారు “నాలాంటి వానికి ఈ విధంగా రహస్యంగా బైఅత్ చేయటం సరికాదు. నువ్వు కూడా ఇలాంటి బైఅత్ పై రాజీపడకూడదు. ఎప్పుడైతే నీవు మదీనా వాసులను తిరిగి మరొకసారి బైఅత్ చేయటానికి పిలుస్తావో అప్పుడు కూడా ఒకవేళ మేము సంకల్పిస్తేనే ఇతర ప్రజలతో పాటు యజీద్ యొక్క బైఅత్ చేస్తాము. అంటే ఈ బైఅత్ దేవుని కోరిక మెరకు కాదు కేవలం ప్రజల దృష్టిని తమవైపు మరలించుకోవటానికి మాత్రమే. ఒకవేళ బైఅత్ జరిగితే అది ప్రత్యక్షంగా[ప్రజల సమక్షంలో] జరగాలి, కానీ ఈ విధంగా రహస్యంగా కాదు” అని అన్నారు. వలీద్ ఇమాంల వారి మాటను అంగీకరించి ఆ రాత్రి వారి నుండి బైఅత్ ను తీసుకోవటానికి ఒత్తిడి చేయలేదు. ఇమాంల వారు దర్బారును వీడి బయటకు వెళుతున్న సమయంలో మర్వాన్ బిన్ హకం సైగలతో వలీద్ కు ఈ విధంగా సందేశాన్ని పంపాడు “ఇప్పుడు నీవు ఈ రాత్రి వేళ ఒంటరిగా ఇమాం హుసైన్[అ.స] ల వారి బై అత్ తీసుకొనలేదో మరెప్పుడూ వారి నుండి బై అత్ ను తీసుకోలేవు,కానీ దానికి చాలా రక్తాన్ని చిందిల్చవలసివస్తుంది,వారిని ఇప్పుడే ఈ దర్బారులోనే ఆపటం మంచిది.ఆ విధంగా వారు యజీద్ యొక్క బై అత్ ను చేయవచ్చు.ఒక వేళ చేయకపోతే యజీద్ ఆజ్ఞానుసారం వారి శిరస్సును వధించు” అని అన్నాడు. అప్పుడు ఇమాం హుసైన్[అ.స] ల వారు “ఓరి జరఖా కుమారుడా![జరఖా మర్వాన్ యొక్క నానమ్మ పేరు,ఆ స్త్రీ తన కాలపు అపఖ్యాతిని మూటగట్టుకున్న స్త్రీలలో ఒకత్తె] నువ్వు నన్ను వధిస్తావా?లేదా అతడా[వలీద్]?నీవు అసత్యాన్ని పలికావు మరియు పాపానికి పాల్పడ్డావు” అని అన్నారు.
రెఫరెన్స్
సుఖనానె హుసైన్ ఇబ్నె అలి అజ్ మదీనె తా కర్బలా,ఆయతుల్లాహ్ ముహమ్మద్ సాదిఖ్ నజఫి.
వ్యాఖ్యానించండి