హుదైబియహ్ సంధి తరువాత ఉమర్ దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చి ఎలా మరియు ఏమనీ ప్రశ్నించారు అన్న అంశం పై సంక్షిప్త వివరణ...

హుదైబియహ్ సంధి సమయంలో దైవప్రవక్త[స.అ] తీసుకున్న నిర్ణయం సహాబీయులలో కొందరికి కొంచెం కూడా నచ్చలేదు. వాళ్ళు చాలా ఉగ్రంగా వ్యతిరేకించారు చివరకి ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ వచ్చి మోటైన స్వరంలో “మీరు నిజమైన దైవప్రవక్త[స.అ] కారా”? అని ప్రశ్నించారు. దైవప్రవక్త[స.అ] “నిస్సందేహముగా!” అని అన్నారు. ఉమర్ “మేము సత్యమార్గంపై మరియు మన శత్రువులు అసత్యమార్గంపై లేరా”? అని అడిగారు. దైవప్రవక్త[స.అ] “నిస్సందేహముగా మీరు చెప్పినట్లే(సత్యమార్గం పై ఉన్నాము)” అని అన్నారు. “అయితే మేము మా మతం పట్ల ఇటువంటి అవమానాన్ని సహించలేము” అని ఉమర్ అన్నారు. “చూడండి, నేను అల్లాహ్ ప్రవక్త[స.అ]ను. నేను అల్లాహ్ పట్ల అపరాధానికి పాలుపడలేను ఎందుకంటే అల్లాయే నాకు రక్ష” అని దైవప్రవక్త[స.అ] అన్నారు. “అతి త్వరలో మేము కాబాకు వెళ్ళి ప్రదక్షణాలు చేద్దామని మాతో మీరు చెప్పేవారు కారా?” అని ఉమర్ అడిగారు. కాని నేను “ఈ సంవత్సరమే మక్కా వచ్చి ప్రదక్షణాలు చేస్తామని అన్నానా!” అని దైవప్రవక్త[స.అ] అన్నారు. “ఇలా అని అనలేదు” అని ఉమర్ అన్నారు. “నీవు తప్పకుండా వస్తావు, వచ్చి ప్రదక్షణాలు చేస్తావు” అని దైవప్రవక్త[స.అ] అన్నారు.[బుఖారీ, భాగం 8, పేజ్ 122]
రిఫ్రెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, కితాబుష్షురూతొ ఫిల్ జిహాద్ అధ్యాయం, భాగం 8, పేజ్ 122. ముస్లిం తన “సహీ” అను పుస్తకంలో “బాబొ సుల్హె హుదైబియహ్” లో లిఖించారు.
వ్యాఖ్యానించండి