.“హసనె బసరీ”, “వాసిల్ ఇబ్నె అతా” "అబూ హనీఫా" మరియు "సుఫ్యానె సూరీ" మొదలగు వారందరు ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క శిష్యులు.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇచ్చే ఉపన్యాస సభలకు మరియు విద్యాలయానికి, ఎవరైతే తరువాత ఫిఖా వర్గాలకు ఇమాములయ్యారో వారే కాకుండా ఫిలాసఫర్స్ మరియు ఫిలాసఫీ నేర్చుకోవాలనుకున్న విద్యార్ధులు వివిధ దూరపు పట్టణాల నుండి వచ్చేవారు. బస్రా పట్టణంలో ఫిలాసఫీ పాఠశాలను స్థాపించిన “హసనె బసరీ”, “మోతజిలహ్” వర్గాన్ని స్థాపించిన “వాసిల్ ఇబ్నె అతా” మొదలగు వారందరూ కూడా ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క శిష్యులే, వీరందరు ఆ జ్ఞానసముద్రం నుండి జ్ఞాన ఆణిముత్యాలు పొందినవారే.
అహ్లెసున్నత్ యొక్క ప్రముఖ విద్వాంసులలో ఒకరైన “అబూ బహ్రె జాహిజ్” ఇలా అన్నారు: ప్రపంచాన్ని తన జ్ఞానంతో నింపేసినవారే జాఫర్ ఇబ్నె ముహమ్మద్[అ.స]. అబూ హనీఫా మరి అలాగే సుఫ్యానె సూరీ వారి శిష్యులు అంటారు, మరి ఈ ఇద్దరి శిష్యరికంతోమే వారి(ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స]) యొక్క జ్ఞాన ప్రతిష్టత నిదర్శనానికి చాలు. [సీమాయే పీష్వాయాన్, పేజీ97]
రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.
వ్యాఖ్యానించండి