ముస్లిముల మధ్య ఎటువంటి విభేదాలు ఉండకూడదనే ఇమాం అలి[అ.స] ల వారు తపనపడేవారు.ముస్లిముల ఐక్యత కోసం తన హక్కును సైతం వదులుకున్న మహామూర్తి ఇమాం అలి[అ.స].
ఇమాం అలి[అ.స] ల వారు ఖిలాఫత్ ను తన హక్కుగా భావించి ఖలీఫాల మార్గాన్ని తప్పుబట్టినా చాలా చోట్ల వారితో ఐక్యత దృష్ట్యా ఏకీభవించేవారు.వారికి ఖలీఫాల పట్ల వారి తీరు పట్ల భిన్నాభిప్రాయాలు ఎన్ని ఉన్నా కేవలం ముస్లిములు శాఖలు లేదా వర్గాలుగా చీలిపోకుండా ఉండటానికి చాలా కృషి చేసేవారు.వారి హదీసులు మరియు ఉపన్యాసాలే దీనికి సాక్ష్యమని చెప్పవచ్చు.సిధ్ధాంతాలు మరియు విశ్వాసాల పరంగా ఇతరులతో వారు విభేదించినా ఇస్లాం మరియు ముస్లిములకు ఏదైన సమస్య ఎదురైనప్పుడు వారు అందరితో కలిసి ఆ సమస్య యొక్క పరిష్కారానికి కృషి చేసే వారు.ఎన్నొ సార్లు ఖలీఫాలు సైతం మతపరమైన సమస్యలలో వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకునేవారు. ఒక హదీసులో ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఆ దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను ఒక వేళ ఈ ముస్లిములు [శాఖలుగా] విడిపోయి మరియు అవిశ్వాసం వైపు మరలిపోయి ధర్మాన్ని నష్టపరిచే ప్రమాదం లేకుంటే వారితో మా ప్రవర్తన తీరు వేరే విధంగా ఉండేది.కేవలం విబేధాలను నివారించటానికి నేను నా హక్కును[ఖిలాఫత్ ను] సైతం వదిలివేయటం జరిగింది” [షర్హె ఇబ్నె అబిల్ హదీద్,ఖుత్బా నం:119].
రెఫరెన్స్: షర్హె నెహ్జుల్ బలాఘా, ఇబ్నె అబిల్ హదీద్,ఖుత్బా నం:119.
వ్యాఖ్యానించండి