ఈ విధంగా చూస్తే బుఖారీ కూడా షియాగా మారిపోయారన్నమాట!...
హజ్రత్ అలీ[అ.స] లేదా అహ్లెబైత్[అ.స]ల ప్రతిష్టలను స్వమతపక్షపాతం లేకుండా వివరిస్తూ అహ్లె సున్నత్ ఉలమాలలో ఎవరైనా ఒక గ్రంథంగాని లేక తన గ్రంథంలో ఒక అధ్యాయంగాని లేదా చివరికి ఏదో ఒక అభిప్రాయం వ్యక్తం చేసినా సరే ఆ రచయితలను “వారు షియాగా మారిపోయారు” అని అహ్లెసున్నత్ ఉలమాలు నిందిస్తారు. ఉదాహరణకు ఇబ్నె ఖుతైబహ్, నిసాయి, తబరీ మొదలగు వారిని ఇమామ్ అలీ[అ.స] ప్రతిష్టలను ఉల్లేఖించటం వల్ల షియాలుగా మారిపోయారు అని నిందించి వారి ప్రాముఖ్యతను తగ్గించారు. చివరికి నేటి ప్రముఖ రచయితలలో తాహా హుసైన్ “అల్ ఫిత్నతుల్ కుబ్రా” వ్రాస్తే ఇతను కూడా షియాగా మారిపోయారు అని అన్నారు. ఇతను గదీర్ హదీసును ప్రస్తావించి చాలా నిజాలను అంగీకరించారు. నిజానికి ఇందులో ఏ ఒక్కరూ షియా కాదు. అందరు షియాలకు సంబంధించి చెడుగానే ప్రస్తావించారు మరియు సహాబీయులందరూ న్యాయముర్తులని పోరాడారు.
ఈ విధంగా చూస్తే బుఖారీ కూడా షియాగా మారిపోయారన్నమాట!. ఎందుకంటే కొన్ని సంధర్భాలలో కొన్ని చోట్లలో బుఖారీ, అలీ[అ.స]ను “అలైహిస్సలామ్”, ఫాతెమా[స.అ]ను “అలైహస్సలామ్”, హుసైన్[అ.స]ను “అలైహిస్సలామ్”[సహీ బుఖారీ, భాగం1, పేజీ 127-130] అని వ్రాశారు అయితే అతను షియా కాదా!!?.
రిఫ్రెన్స్
సహీ బుఖారీ, భాగం1, పేజీ 127-130, భాగం 2, పేజీ 126 మరియు 205.
వ్యాఖ్యానించండి