సమాజంలో అల్లర్లను సృష్టించి తప్పించుకుందాం అనుకోవటం తప్పు ఒక రోజు ఆ అల్లర్ల యొక్క ఊబిలో మీరు కూడా తప్పక చిక్కుకుంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోగలరు.
ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎవరైతే కుట్రల యొక్క నిప్పును వెలిగిస్తారో వారే ఆ అగ్నికి ఆహుతి అవుతారు”.అల్లర్లు మరియు కుట్రలు సమాజం యొక్క భద్రతకు భంగాన్ని కలుగజేస్తాయి మరియు పర్యావరణాన్ని అనుచితంగా చేస్తాయి.ఎంతవరకంటే ఆ నీప్పును అంటించిన వాడు కూడా ఆ అగ్నికీలలలో మండి మసవ్వక తప్పదు. ఎవరైతే అల్లర్లను సృష్టించి ఈ సమాజం యొక్క శాంతికి భంగం కల్పించాలనుకుంటారో వారు కూడా ఈ సమాజం యొక్క భాగమే.ఎలాగైతే ఒక ఇంటిని కాల్చి దానిని బూడిద చేయాలనే దురాలోచనతో దానికి నిప్పంటిస్తారో ఆ నిప్పు కొద్దిసేపటికి మీ ఇంటికి కూడా చేరుకోగలదు అనేది గుర్తుంచుకోవాలి. సమాజంలో చేయబడే కుట్రలు కేవలం ఒక వ్యక్తి లేదా ఒక సమూహానికి నష్టాన్ని కలుగజేస్తాయి అనుకోవటం తప్పు.ఒక వేళ ఈ సమాజంలో మొదటి కుట్ర చేసింది మీరేనైతే ఆ సమాజంలో జరిగే ఇతర కుట్రలకు కూడా మీరే ఎంతోకొంత బాధ్యులు.అది చివరకు వచ్చి మీపైనే సమాప్తమవుతుంది. అందుకే తాను ఇతరులకు తవ్వే గోతిలో ఒక రోజు తానే తప్పక పడతాడు అనడంలో సందేహం లేదు.
రెఫరెన్స్: హిక్మత్ హాయె అలవి,జవాద్ మొహద్దసి.
వ్యాఖ్యానించండి