ఇమాం అలి[అ.స]ల వారి దృష్టిలో మానవునిలో మార్పు కలిగే సందర్భాలు.
ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: "మానవునిలో మూడు సందర్భాలలో మార్పు వస్తుంది: 1. రాజులను సమీపించినప్పుడు. 2. రాజ్యాధికారాన్ని మరియు పదవిని పొందినప్పుడు. 3. సంపన్నుడైనప్పుడు". మానవునికి అధికారం వచ్చినప్పుడు లేదా అతను ధవంతుడైనప్పుడు ప్రజలతో అతని ప్రవర్తన ఎలాగుంటుంది? అనేది ఒక పరీక్షతో కూడుకున్నది.కొందరిలో తొందరగా మార్పు వస్తుంది. వారు తొందరగా తమ ఓటమిని స్వీకరించినవారవుతారు.అల్లాహ్ మార్గాన్ని అల్లాహ్ సామిప్యాన్ని వదిలి రాజ్యాధికారుల సామిప్యాన్ని కోరుకునేవారు తమ పరలోకాన్ని ఎటువంటి వెల లేని ఈ ప్రాపంచిక జీవితానికి బదులు అమ్ముకున్నట్లే. వారికి ఆ అల్లాహ్ వద్ద శిక్ష తప్పదు. మరికొందరు ధనవంతులైనప్పుడు తమ దగ్గరపు బంధువులను మరియు స్నేహితులను సైతం ఎరుగనట్లు వ్యవహరిస్తారు. ఈ వ్యవహారశీలి కూడా కొద్దో గొప్పో తమ వద్ద ఉన్న ధనాన్ని చూసే.ప్రపంచాన్నే శాసించిన ఫిరౌన్,షద్దాద్,హామాన్,సికిందర్ లాంటి వారినే ఈ ధనము ఎటువంటి లాభాన్ని చేకూర్చలేకపోయింది.అలాంటిది ఈ మానవునికి ఏ విధంగా ప్రయోజనాన్ని కలుగజేస్తుంది? ప్రయోజనాన్ని కలుగజేసేవి,అల్లాహ్ వద్ద ప్రతిఫలం రీత్యా మేలైనవి కేవలం మానవుడు చేసే సత్కార్యాలు మాత్రమే.
రెఫరెన్స్: గురరుల్ హికం, 2వ భాగము, పేజీ నం: 146.
వ్యాఖ్యానించండి