ఈ ప్రాపంచిక జీవితానికి స్థిరత్వము లేదు,ఎల్లప్పుడూ మారుతూ ఉండటం దాని లక్షణం.ఈ ప్రాపంచిక జీవితం శాస్వతమని భావించటం మూర్ఖత్వం.
దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ప్రపంచం మారుతుంది దానికి స్థిరత్వం లేదు ఎదైతే నీ గురించి ఖరారు చేయబడినదో అది నీకు లభిస్తుంది. చివరికి నువ్వు బలహీనుడు,దుర్బలమైనవాడివైనా సరే మరియు అది నీకు నష్టాన్ని కలిగించేదైన సరే అది నీకు చేరుతుంది, నువ్వు ఎంత బలం మరియు శక్తిపరంగా ఎంత పరిపూర్ణతతో ఉన్నా[ఎంత బలవంతులైనా సరే] దానిని అడ్డుకోలేవు,మరియు ఎవరైతే తాను పోగొట్టుకున్న దాని పట్ల ఉన్న ఆశను వదిలివేస్తాడో అతని శరీరం మానసికంగా శాంతిస్తుంది. మరియు ఎవరైతే దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి పడతాడో అతని హృదయం మరియు కళ్ళు ప్రకాశవంతంగా మారుతాయి”. ఈ ప్రాపంచిక జీవితం ఎవరికోసమైనా సరే శాస్వతం కాదు.అది మారుతూ ఉంటుంది దానిలో ఎటువంటి స్థిరత్వము లేదు ఇది వాస్తవం.నేను ఎదో చేసేస్తాను,నేను అనుకున్నది తప్పక జరుగుతుంది అనుకోవటం పొరపాటే నీ కార్యాలను నీ రాతను రాసే వాడు ఆ అల్లాహ్ మాత్రమే.ఒక వేళ నువ్వు నేను అనుకున్నది జరగాలి అంటే అల్లాహ్ నీ ప్రణాళికలను పూర్తి కానివ్వడు.కాబట్టి నువ్వు నీ కర్తవ్యాలను నిర్వర్తించు ఇతర విషయాలను ఆ అల్లాహ్ కు వదిలేయి. నీ మీద లేదా నీ యొక్క సామర్ధ్యం మీద లేదా నీ ఆలోచనలపై ఎప్పటికీ ఆధారపడకు.మరియు అల్లాహ్ నీ గురించి దేనినైతే ఖరారు చేస్తాడో దానితో రాజీ పడు.ఎప్పుడైతే నువ్వు అల్లహ్ ఇచ్చిన దానిపై రాజీపడి జీవిస్తావో అప్పుడే ఆ జీవితం సుఖశాంతులతో గడుస్తుంది.
రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,74వ భాగము,పేజీ నం: 145.
వ్యాఖ్యానించండి