మనం చేసే కొన్ని పనుల ప్రభావం మరణంతో ఆగిపోకుండా మనతోపాటు ప్రళయం వరకూ తమ ప్రభానాన్ని చూపుతాయి...
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: మనిషి మరణానంతరం కూడా నిలిచిపోని ఏడు విషయాలు, అవి:
1. ఇతరులకు నేర్పించిన మరియు ఉపయోగపడే జ్ఞానం
2. కాలువలను ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయటం, ముఖ్యంగా వ్యవసాయదారులకు, తోటాదారులకు మరియు ఇలాంటి ఇతర సమూహాలకు చెందిన వారి కోసం
3. ప్రజల ఉపయోగం కోసం బావి త్రవ్వటం
4. ప్రజలు పండ్లు తినటం మరియు నీడను పొందేందుకు చెట్లు నాటటం
5. మస్జిదులను కట్టటం(నమాజ్ చదవటంతో పాటు తమ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంశాల పరిష్కారాల పై చర్చలు జరపడానికి....)
6. ఖుర్ఆన్ (లేక ఇతర మతసంబంధిత గ్రంథాలను) విడిచి వెళ్ళటం
7. మరణానంతరం అతడి కోసం మగ్ఫిరత్ ను కోరే మంచి సంతానం[నెహ్జుల్ ఫసాహత్, పేజీ366]
రిఫ్రెన్స్
అబుల్ ఖాసిమ్, పాయ్ బంద్, నెహ్జుల్ ఫసాహా, దునియాయె దానిష్, తెహ్రాన్-ఇరాన్, 1382ష.
వ్యాఖ్యానించండి