దైవప్రవక్త[స.అ.వ] ల వారు వర్షపు రాత్రులలో సైతం పైకప్పు లేని మస్జిదే మదీనా లో షబె ఖద్ర్ యొక్క ప్రార్ధనలను విడిచి పెట్టేవారు కాదు,అదే మట్టిలో తడుస్తూ ప్రార్ధనలు చేస్తూ ఇతరులకు ఈ రాత్రి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా చేసేవారు.
దైవ ప్రవక్త[స.అ.వ] ల వారు రమజాన్ యొక్క చివరి పది రాత్రులను మేల్కొని గడిపేవారు,ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: దైవప్రవక్త[స.అ.వ] ల వారు రమజాన్ యొక్క చివరి పది రాత్రులను తన పరుపును ఎత్తి వేసేవారు,మరియు రమజాన్ యొక్క 23వ రాత్రి వారు తమ కుటుంబ సభ్యులందరని మేల్కొలిపి ఉంచేవారు.వారు వర్షపు రాత్రులలో సైతం పైకప్పు లేని మస్జిదే మదీనా లో ప్రార్ధనలను విడిచి పెట్టేవారు కాదు,అదే మట్టిలో తడుస్తూ ప్రార్ధనలు చేస్తూ ఇతరులకు ఈ రాత్రి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేలా చేసేవారు.ఇమాం అలి[అ.స] ల వారు కూడ ఈ రాత్రికి చాలా విలువిచ్చేవారు.మస్జిదే మదీనా అంతా నీటితో నిండిపొయినా సరే వారు తమ ప్రార్ధనలలో నిమగ్నమై ఉన్నారు.ముఖ్యంగా వారి జీవితపు ఆఖరి షబే ఖద్ర్ ను కూడా ఇదే విధంగా గడపటం జరిగింది.ఇమాం మొహమ్మద్ బాఖిర్ [అ.స] ల వారి గురించి షైఖ్ అబ్బాసె ఖుమ్మి ఈ విధంగా సెలవిచ్చారు: ఇమాం మొహమ్మద్ బాఖిర్[అ.స] ల వారు 21 మరియు 23 వ రాత్రులలో,అర్ధరాత్రి వరకు ప్రార్ధనలలో నిమగ్నమై ఉండి ఆ తరువాత నమాజు చేసేవారు.ఇమాం కాజిం[అ.స] ల వారు కూడా ఈ రాత్రికి చాలా ప్రాధాన్యతను ఇచ్చే వారు.ఒక చోట దీని ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు: ఎవరైతే ఈ రాత్రి గుస్ల్[ప్రత్యేక తల స్నానం] చేసి,తెల్లవారే వరకు [ప్రార్ధనలలో] మెలుకువగా ఉంటారో,వారి పాపాలన్ని క్షమించబడతాయి.
రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,95వ భాగము,పేజీ నం: 10,41వ భాగము,పేజీ నం: 21,మఫాతీహుల్ జినాన్,షైఖ్ అబ్బాసె ఖుమ్మి,పేజీ నం: 425,720.
వ్యాఖ్యానించండి