ఆది, 08/02/2020 - 15:48
అబద్ధాలకోరు అల్లాహ్ మరియు ఆయన దూతల శాపానికి గురి అవుతారు...
అబద్ధం చెప్పటం ఎంత అయిష్టమైన చర్య అంటే అబద్ధం చెప్పేవారు అల్లాహ్ మరియు ఆయన దూతల శాపానికి గురి అవుతారు. అల్లాహ్ మరియు దూతల లఅనత్ కు అర్హుడవుతాడు.
దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను: “అల్లాహ్ అబద్ధాలకోరును శపిస్తాడు; అతడు పరిహాసానికి అబద్ధం చెప్పినా సరే[ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ88]
మరోచోట ఇలా ఉపదేశించారు: ఎప్పుడైతే ఒక విశ్వాసి, కారణం లేకుండా అబద్ధం చెబుతాడో, డబ్భైవేల దూతలు అతడిని శపిస్తారు మరియు అతడి హృదయం నుండి చెడువాసన బయటకు వస్తుంది, దాని వాసన ఆకాశానికి చేరుతుంది., అప్పుడు హామిలానె అర్షె ఇలాహి(ఆకాశాన్ని ఎత్తుకొని ఉన్న దూతలు) కూడా అతడిని శపిస్తారు.[ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ86]
రిఫరెన్స్
మొహద్దిసె నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, హదీస్10300 మరియు10291.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి