ఇమామ్ అలీ నఖీ(అ.స) కాలంలో అధికారుల మరియు రాజకీయ పరిస్థితుల గురించి సంక్షిప్తంగా...
బిస్మిల్లాహిర్రహ్మనిర్రహీమ్
ఇమామ్ అలీ నఖీ(అ.స)
ఇమామ్ అలీ నఖీ(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క 10వ ఉత్తరాధికారి. జిల్ హిజ్ మాసం 15వ తేది హిజ్రీ యొక్క 212 సంవత్సరంలో మదీనహ్ యొక్క చుట్టప్రక్కలకు చెందిన ఒక ప్రదేశం అయిన “సిర్యా”లో జన్మించారు.[1] తండ్రి ఇమామ్ జవాద్(అ.స) తల్లి “సమానహ్”. ఇమామ్ యొక్క ప్రముఖ బిరుదులు “నఖీ” మరియు “హాదీ”, వారిని “అబుల్ హసనె సాలిస్” అని కూడా అంటారు.[2]
ఇమామ్ కాలంలో ఉన్న అధికారులు
ఇమామ్ హాదీ(అ.స) ఇమామత్ కాలం కొన్ని ఖలీఫాల అధికారంలో గడిచింది. వారి క్రమం:
1. మొతసిమ్, మామూన్ సొదరుడు – హిజ్రీ 217 నుంచి 227 వరకు
2. వాసిఖ్, మొతసిమ్ కుమారుడు – హిజ్రీ 227 నుంచి 232 వరకు
3. ముతవక్కిల్, వాసిఖ్ సోదరుడు - హిజ్రీ 232 నుంచి 248 వరకు
4. ముంతసిర్, ముతవక్కిల్ కుమారుడు – 6 మాసాలు
5. ముస్తయీన్, ముంతిసర్ పినతండ్రి కుమారుడు - హిజ్రీ 248 నుంచి 252 వరకు
6. మొఅతజ్జ్, ముతవక్కిల్ మరో కుమారుడు – హిజ్రీ 252 నుంచి 255 వరకు
ఇమామ్ హాదీ(అ.స) చివరి ఖలీఫా కాలంలో విషం ద్వార చంపబడ్డారు. వారి ఇంట్లోనే వారిని ఖననం చేశారు.
రాజకీయ మరియు సామాజిక పరిస్థితులు
పై చెప్పబడిన అబ్బాసీ ఖలీఫాల కాలం ప్రత్యేకతల ద్వార ఈ కాలం ఇతర ఖలీఫాల కాలాల పరిస్థితులను వేరు చేస్తుంది. వాటి నుంచి కొన్ని ప్రత్యేకతలు తెలుసుకుందాం:
1. ఖిలాఫత్ యొక్క గొప్పతనం మరియు గంభీరత్వం క్షీణత,
2. అధ్యక్షుల మానోవాంఛలకు బానిస అవ్వడం,
3. అన్యాయం, ఘాతకం మరియు స్వయ సంతోషాలు ఎక్కువ అవ్వడం,
4. అలవీయుల తిరుగుబాటుదారుల సంఖ్య పెరగడం.
వీటి కారణంగా అబ్బాసీ ఖలీఫాల కాలం పరిస్థితులు ఇతర ఖలీఫాల కాలలతో పోలిస్తే మారాయి. చరిత్ర హిజ్రీ యొక్క 219 నుంచి 270వ సంవత్సరం వరకు 18 తిరుగుబాటు దాడులు జరిగాయి అని చెబుతుంది. ఇవన్నీ సరైన నాయకత్వం లేకపోవడంతో అబ్బాసీయుల ముందు అపజయానికి గురయ్యాయి.
మదీనహ్ నుంచి సామెర్రాకు ఇమామ్ బదిలీ
ఇమామ్ హాదీ(అ.స) యొక్క ఎక్కువ కాలం ముతవక్కిల్ ఖిలాఫత్ కాలంలో గడిచింది. అతడి ప్రవర్తన బనీ హాషింల పట్ల మంచిగా ఉండేదికాదు. అతడు వారిని నిత్యం అనుమానించేవాడు, వారిని నిందిస్తూ ఉండేవాడు. ఇమామ్ హాదీ(అ.స) పై నిఘా పెట్టడానికై తన పూర్వీకుల పద్ధతిని ఎంచుకొని ఇమామ్ హాదీ(అ.స)ను మదీనహ్ నుంచి సామెరాకు బదిలీ చేశాడు.
ముతవక్కిల్ ఆదేశానుసారం ఇమామ్ ను సామెరాకు తీసుకొచ్చారు. ఇంకా వారి నిలయం సిద్ధం కాలేదనే సాకుతో వారిని పెదవారికోసం నిర్మించబడ్డ నిలయంలో ఉంచారు. ఆరోజు ఇమామ్ అక్కడే ఉన్నారు. తరువాత రోజు వారిని వేరే చోటుకు మార్చారు.[3]
అక్కడ ఇమామ్ పైకి స్వేచ్ఛగా ఉన్నారు అని అనిపించినా ఒక కారాగారంలో ఉన్నట్లు ఉన్నారు. ఇమామ్ పై నిఘా ఉండేది. వారి రాకపోకలను కంట్రోల్ చేసేవారు.
ప్రతినిధులతో కమ్యూనికేషన్ నెట్వర్క
ఇమామ్ హాదీ(అ.స) పై నిత్యం గట్టి నిఘా ఉన్నప్పటికీ, వారు కూడా వారి తండ్రి మాదిరి ప్రతినిధులను నియమించారు. వారు ద్వారానే ఇమామ్ తన షియా అనుచరుల సమస్యలను తీర్మానించేవారు.
వారి ప్రతినిధులు షియాలను వారు నివసించే ప్రాంతాలను బట్టి నాలుగు భాగాలుగా విభజించారు. మొదటిది బగ్దాద్, మదాయిన్ మరియు ఇరాఖ్(కూఫా) ప్రాంతాలు. రెండవది బస్రా మరియు అహ్వాజ్
ప్రాంతాలు. మూడవది ఖుమ్ మరియు హమెదాన్ ప్రాంతాలు. నాలుగొవది హిజాజ్, యమన్ మరియు మిస్ర్ ప్రాంతాలు. ప్రతీ ప్రాంతానికి ఒక ముఖ్య ప్రతినిధిని నియమించబడేవారు, ఆ ప్రతినిధి క్రింద మరి కొంత మంది ఉండేవారు. ఇమామ్ హాదీ(అ.స) తన ఆదేశాలను, సూచలను ఆ ముఖ్యప్రతినిధికి పంపేవారు. వారు దాని ప్రకారం అమలు చేసేవారు. చరిత్రలో ఇమామ్ తన ప్రతినిధులకు ఉత్తరముల ద్వార తెలియపరచిన ఎన్నో అంశాలు ఉల్లేఖించబడి ఉన్నాయి.[4]
రిఫరెన్స్
1. తబర్సీ, ఎఅలాముల్ వరా, తా3, తహ్రాన్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియ, పేజీ355. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మన్షూరాతు మక్తబతి బసీరతీ, పేజీ327.
2. అబుల్ హసనె అవ్వల్ అనగా ఇమామ్ మూసా కాజిమ్(అ.స), అబుల్ హసన్ సాని అనగా ఇమామ్ రిజా(అ.స).
3. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మక్తబతు బసీరతీ, పేజీ334.
4. సీరయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, ఇమామ్ హాదీ(అ.స) జీవిత చరిత్ర అధ్యాయం నుంచి.
వ్యాఖ్యానించండి