ఇమామ్ హాదీ(అ.స) విజ్ఞాన సేవలు మరియు వారి శిష్యుల గురించి సంక్షిప్తంగా...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఇమామ్ హాదీ(అ.స) కాలంలో విశ్వాస పరమైన ఎన్నో వర్గాలు ఉదా; “మొతజిలా”, “అషాయిరహ్” వెలుగులోకి వచ్చి తమ విశ్వాసాలను బలపరుచుకోవడం మొదలు పెట్టాయి. అల్లాహ్ కు శరీరం ఉంది, అల్లాహ్ కనబడతాడు లాంటి చాలా తప్పుడు విశ్వాసాలు ఉండేవి. ఇమామ్ వాటిని నిషేదించడానికై వారితో చర్చలు చేసి వారి నమ్మకాలను తప్పుడు నమ్మకాలుగా నిరూపించేవారు.
ఇమామ్ హాదీ(అ.స) కాలంలో తప్పుడు మార్గంలో ఉన్న సమూహాలలో ఒకటి గుల్లాత్ సమూహం. వాళ్లు ఇమామ్ పట్ల అతికి గురి అయి ఉండేవారు, వారు ఇమామ్ ను దైవస్థానం కలిగివున్నవారు అని భావించేవారు. వారు తమను షియా వర్గానికి చెందినవారుగా పరిచయించుకునేవారు. దాంతో నిజమైన షియాలు అపఖ్యాతికి పాలయ్యేవారు. ఇమామ్ వారి పట్ల అసహ్యాన్ని వ్యక్తం చేసేవారు. వారి పట్ల తీవ్రమైన చర్యలు చేపట్టేవారు. వారిని దిక్కరించి షియా వర్గానికి చెడ్డపేరు రాకూడదని ప్రయత్నించేవారు.[1]
జ్ఞాన దప్పిక కలిగివున్నవారు, వారి వద్దకు వచ్చి తమ దప్పికను తీర్చుకునేవారు. వారి శిష్యులు 185 మందికి మించి ఉండేవారు.[2] వారిలో ప్రముఖుల పేర్లు..
1. అయ్యూబ్ ఇబ్నె నూహ్, 2. హసన్ ఇబ్నె రాషిద్, 3. హసన్ ఇబ్నె అలీ నాసిర్, 4. అబ్దుల్ అజీమె హసనీ, 5. ఉస్మాన్ ఇబ్నె సయీద్[3]
రిఫరెన్స్
1. సీరయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, ఇమామ్ హాదీ(అ.స) జీవిత చరిత్ర అధ్యాయం నుంచి.
2. షేఖ్ తూసీ, రిజాల్, పేజీ409.
3. ఆయతుల్లాహ్ ఖుయీ, మొజము రిజాలిల్ హదీస్, భాగం3, పేజీ260-262.
వ్యాఖ్యానించండి