“అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు సహాబీయులందరి సున్నత్ పై అమలు చేస్తారు” అన్న విషయం పై కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. దీనిపై సంక్షిప్త వివరణ...
అహ్లెసున్నత్ లు, తమ తరపు నుండి సృష్టించుకున్నటువంటి మూల ఆధారములలోనే వారి మరియు షియాల మధ్య వ్యతిరేకత ఉంది. వాటిలో ఒకటి: సహాబీయులందరి సున్నత్. దాని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందా
“అహ్లెసున్నత్ వల్ జమాఅత్ వారు సహాబీయులందరి సున్నత్ పై అమలు చేస్తారు” అన్న విషయం పై కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి.
దానిని ఒక చిన్న హదీస్ ద్వార నిరూపిస్తారు. ఈ టాపిక్ పై చాలా పుస్తకాలలో పూర్తిగా సంతృప్తిపరిచే విధంగా చర్చించించడం జరగింది. ఆ హదీస్ ఇది: “اصحابی کالنجوم بایتھم اقتدیتم اھتدیتم; నా సహాబీయులు నక్షత్రముల వంటివారు, (వారిలో)ఎవరిని అనుసరించినా రుజుమార్గం పొందుతావు”.
“ఇబ్నె ఖయ్యిమ్ జౌజియహ్” ఈ హదీస్ ద్వార సహాబీయుల అభిప్రాయాలు నమ్మదగినవి, అని నిరూపించారు.[1]
“షేక్ అబూ హురైరహ్” కూడా దీనిని అంగీకరించారు. మరియు అతను ఇలా అన్నారు: “నిస్సందేహముగా మేము అహ్లెసున్నత్ ఫిఖాజ్ఞానులను సహాబీయుల ఫత్వల పై అమలు చేసేవారుగా చూశాను” ఆ తరువాత రెండవ ప్యారాగ్రాఫ్ లో ఇలా వ్రాశారు: ప్రముఖ ఫిఖాజ్ఞానులు సహాబీయుల ప్రవచనములను మరియు ఫత్వాలను నమ్మకమైనవిగా భావిస్తారు, కాని షియాలు ఈ విషయంలో వారితో ఏకీభవించరు. ఇబ్నె ఖయ్యిమె జౌజీ 46 రకాలుగా ప్రముఖ సహాబీయులను సమర్థించాడు మరియు అవన్నీ బలమైనవే.[2]
షేఖ్ అబూ జొహ్రహ్ తో మేము ఇలా ప్రశ్నిస్తున్నాము: అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ కు వ్యతిరేకమైన విషయం, గట్టి సాక్ష్యం ఎలా అవుతుంది!?.
“ఇబ్నె ఖయ్యిం”, ఎన్ని సాక్ష్యాలు ప్రదర్శించాడో అవన్నీ సాలెపట్టువలే సున్నితమైనవి మరియు వికృతమైనవి. ఆ తరువాత అతనే స్వయంగా వాటిని ఇలా చెప్పి రద్దు చేశారు: షూకాని ఇలా అన్నారు: సహాబీయుల వచనం నమ్మదగినది కాదు. ఎందుకంటే అల్లాహ్ ఈ ఉమ్మత్ లో మన ప్రవక్త ముహమ్మద్(స.అ) తప్ప మరెవ్వరిని ఎన్నుకోలేదు. సహాబీయులు మరియు వారి తరువాత వచ్చే వాళ్ళు ఆ దైవప్రవక్త(స.అ) యొక్క షరీఅత్ ను అనుసరించే విషయంలో సమానం. అనగా ఖుర్ఆన్ మరియు సున్నత్ లో ఏదైతే ఉందో దానిని అనుసరించడం, మరియు దాని పై అమలు చేయడం, అందరి పై వాజిబ్ చేయబడింది. కనుక ఎవరైతే అల్లాహ్ దీన్ లో అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ కాకుండా వేరే దేనినైనా “మూల ఆధారం” అని అంగీకరిస్తున్నట్లైతే, అతను అల్లాహ్ దీన్ గురించి చెప్పే మాటలు ఆధారం లేనివి. అంతేకాదు అల్లాహ్ ఇలాంటి ఆదేశాలు ఇవ్వడు. అని షరా పరంగా నిరూపించబడి ఉంది.[3]
“షూకానీ”, వందానార్హులు. అతను యదార్ధాన్ని చెప్పారు, సత్యాన్ని వెల్లడించారు. మరియు తాను తన వర్గం నుండి ప్రభావితం కాలేదు. అతని వచనం పవిత్ర ఆయిమ్మాల(అ.స) వచనానికి అనుకూలంగా ఉంది. ఒకవేళ అతని కార్యముల కూడా అతని మాటలకు అనుకూలంగా ఉంటే, అల్లాహ్ అతనితో రాజీపడినట్లే. మరియు అతను అల్లాహ్ ను రాజీ పరుచుకునే ఉంటారు.
రిఫరెన్స్
1. ఆలాముల్ మురఖ్ఖయీన్, భాగం4, పేజీ122.
2. ఇది షేఖ్ అబూ జొహ్రహ్ యొక్క రెండవ అంగీకారము, ఇది “షియాలు అల్లాహ్ షరీఅత్
లో అల్లాహ్ గ్రంథం మరియు దైవప్రవక్త సున్నత్ తప్ప వేరే వాటి జోక్యం లేదు” అన్న మా మాటను సమర్థిస్తుంది.
3. షేఖ్ అబూజోహ్రహ్, పేజ102.
వ్యాఖ్యానించండి