.దైవప్రవక్త[స.అ] సహాబీయులలో కూడా తరగతులు ఉన్నాయి. “సహాబీయులందరూ న్యాయస్థుల అందరూ మంచివారు” అన్న నమ్మకం సరైనది కాదు.
సహాబీయులలో కూడా తరగతులున్నాయి. అందరిని ఒకే తరగతికి చెందినవారు అని భావించడం ఉన్మాదితనం. వారిలో కొందరు అల్లాహ్ పట్లా, ఇస్లాం పట్లా మరియు దైవప్రవక్త[స.అ] పట్లా విధేయతను చాటి తమ విశ్వాసాన్ని సంపూర్ణానికి చేర్చిన విశ్వాసులు కూడా ఉన్నారు. వారిలో విశ్వాసపరంగా బలహీనమైన వారు కూడా ఉన్నారు. వారిలో కొందరు ఒక్కక్షణానికి కూడా ఈమాన్ వారి హృదయాలలో ప్రవేశించని వారు కూడా ఉన్నారు. వారిలో ధర్మనిష్ఠ మరియు భీతి గలవారు కూడా ఉన్నారు. వారిలో ఔచిత్యముగల వారు ఉన్నారు, వారిలో గొప్పగొప్ప న్యాయస్థులు కూడా ఉన్నారు, వారిలో నీచమైన దూర్మార్గులు కూడా ఉన్నారు, వారిలో యదార్థవిధేయులైన విశ్వాసులు కూడా ఉన్నారు, వారిలో దుర్మార్గలులు, అపరాధులు కూడా ఉన్నారు, వారిలో ఆచరించే జ్ఞానులు కూడా ఉన్నారు, వారిలో బిద్అత్ సృష్టించే అజ్ఞానులు కూడా ఉన్నారు. వారిలో నిష్కపటము గల వారు కూడా ఉన్నారు, వారిలో కపటవర్తనులు, నాకిసీన్లు, ముర్తద్
లు కూడా ఉన్నారు.
ఖుర్ఆన్, దైవప్రవక్త(స.అ) హదీస్ లు మరియు చరిత్ర స్పష్టంగా వారి గురించి వివరించిన తరువాత కూడా ఎవరైనా “సహాబీయులందరూ న్యాయస్థుల అందరూ మంచివారు” అని నమ్మితే వారి ఈ మాట విలువలేనిది మరియు అవివేకమైనది, ఎందుకంటే వాళ్ళ ఈ వచనం ఖుర్ఆన్ మరియు హదీస్, బుద్ధి మరియు చరిత్రకు వ్యతిరేకమైనది. వాళ్ళ ఈ నమ్మకం కేవలం ప్రతిపక్షపాతం, మరియు సాక్ష్యాలు లేని మాటలు.
ఈ అంశం పై ఒక పరిశోధకుడికి బుద్ధి, ఉల్లేఖనం మరియు చరిత్రను వ్యతిరేకించి ఇలా నమ్మే వారి బుద్ధివివేకాల పై ఆశ్చర్యం కలుగుతుంది.
వ్యాఖ్యానించండి