ఇరాన్ దేశానికి చెందిన కిర్మాన్ పట్టణం లో జరిగిన ఉగ్రవాద పేలుళ్ల గురించి సమాచారం...
జనవరి 3వ తేదీ, 2024, బుధవారం నాడు షహీద్ ఖాసిమ్ సులైమానీ యొక్క నాలుగొవ వార్షికోత్సవం సందర్భంగా ఇరాన్ దేశానికి చెందిన కిర్మాన్ పట్టణంలో ఇది షహీద్ ఖాసిమ్ సులైమానీ జన్మస్థనం మరియు వారి సమాధి కూడా అక్కడే ఉంది.
రిపోర్ట్స్ ప్రకారం మొదటి పేలుడు షహీద్ ఖాసిమ్ సులైమానీ సమాధికి700 మీటర్ల దూరంలో మరియు రెండవ పేలుడు ఒక కిలో మీటర్ దూరంలో జరిగాయి. షహీద్ ఖాసిమ్ సులైమానీ యొక్క నాలుగొవ వార్షికోత్సవంలో పాల్గొవడానికి విచ్చేసిన సందర్శకులపై ఈ దాడులు జరిగాయి.
మొదటి పేలుడు అక్కడి సమయం ప్రకారం 14..50 కు మరియు రెండవ పేలుడు, మొదటి పేలుడు జరిగిన 15 నిమిషాల తరువాత జరిగింది.
పేలుళ్ల తరువాత జనం చిందరవందరయ్యారు, పేలుళ్ల సమాచారం అందగానే Rapid Action Force అఫీషియల్స్ ఆ ప్రదేశానికి చేరుకున్నారు.
ఈ ఉగ్రవాద దాడుల్లో ఇప్పటి వరకు 84 తమ ప్రాణాలు కోల్పోయారు మరియు 211 గాయపడ్డారు. గాయపడినవాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది అందువల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సోర్సస్ ఇది ఆత్మాహుతి దాడి కాదు ఇది రిమోట్ కంట్రోల్ ద్వార బ్యాగ్గుల్లో పెట్టిన బాంబుల ద్వార జరిగిన దాడులు అని వెళ్లడించారు.
అధికారుల రిపోర్ట్ ప్రకారం గాయపడినవారందరినీ ఆసుపత్రులకు తరలించారు, ఇప్పుడు పరిస్థితులు కంట్రోల్ లోనే ఉన్నాయి.
నిన్న జరిగిన ఈ ఉగ్రవాధ పేలుళ్ల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, నిరసన మరియు తమ దుఖాఃన్ని వ్యక్తం చేస్తే గురువారం రోజు ఇరానంతట సంతాపదినంగా ప్రకటించారు.
రిఫరెన్స్
https://ur.btid.org/node/7948
https://ur.btid.org/node/7950
వ్యాఖ్యానించండి