కష్టాలలో కూరుకున్న తన దాసులను వాటినుండి బయటకు తీయగల శక్తి ఆ అల్లాహ్ కి తప్ప మరెవరికి లేదు,అందుకే వారు ఆ అల్లాహ్ కి తప్ప ఎవరికి భయపడరు.
మహాప్రవక్తను బెదురిస్తూ మక్కాలోని విగ్రహారాధులు ఈ విధంగా చెప్పారు: “నువ్వు మా విగ్రహాలను దూషించినా లేదా వారి గురించి చెడుగా చెప్పినా స్వయాన నువ్వే నిన్ను ఆపదలో వేసుకున్నవాడివవుతావు”,అప్పుడు అల్లాహ్ తన ప్రవక్తను సంభోదిస్తూ ఈ విధంగా సెలవిస్తున్నాడు:
أَلَيْسَ ٱللَّهُ بِكَافٍ عَبْدَهُۥ ۖ وَيُخَوِّفُونَكَ بِٱلَّذِينَ مِن دُونِهِۦ ۚ وَمَن يُضْلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنْ هَادٍۢ٭وَمَن يَهْدِ ٱللَّهُ فَمَا لَهُۥ مِن مُّضِلٍّ ۗ أَلَيْسَ ٱللَّهُ بِعَزِيزٍۢ ذِى ٱنتِقَامٍۢ
అనువాదం: “ఏమిటి, తన దాసునికి అల్లాహ్ సరిపోడా? వీళ్లు నిన్ను అల్లాహ్ తప్ప ఇతరుల గురించి భయపెడుతున్నారు. అల్లాహ్ అపమార్గం పట్టించిన వానికి మార్గం చూపించగల వాడెవడూ లేడు, అల్లాహ్ మార్గం చూపినవానిని ఎవడూ అపమార్గం పట్టించలేడు. ఏమిటి, అల్లాహ్ ప్రాబల్యం కలవాడు, ప్రతీకారం చేసేవాడు కాడా?”
ఈ ఆయత్ ఉపదేశిస్తున్న అంశాలు:
1. ఎప్పుడైతే మనిషి అల్లాహ్ దాసునిగా మారతాడో అతనికి బీమా లభించినట్లే,ఎందుకంటే ఇప్పుడు అల్లాహ్ అతని వ్యవహారాలను తన వ్యవహారాలుగా తీసుకుని వాటిని పరిష్కరిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు.[“తన దాసులకి అల్లాహ్ సరిపోడా?”,జుమర్/36]
2. ఎప్పుడైతే శత్రువులు బెదిరిస్తారో అప్పుడు ఆ అల్లాహ్ దాసులు దేవుని స్మరణ మరియు అతనితోనే సహాయాన్ని కోరుతారు ఎందుకంటే దీని ద్వారానే వారి హ్రుదయాలు నెమ్మదిస్తాయి [“అల్లాహ్ స్మరణతోనే హ్రుదయాలు నెమ్మదిస్తాయి”,అర్-రాద్/28].
3. రుజుమార్గాన్ని చూపటం మరియు అపమార్గానికి మళ్ళించటం అంతా ఆ అల్లాహ్ చేతిలో ఉన్నది,నిన్ను ఎవరు ఎంత కృషిచేసినా రుజుమార్గం నుంచి తప్పించలేరు[ఆ దేవుడు తప్ప],[అల్లాహ్ ఎవరికి సన్మార్గం చూపుతాడో అతడే సన్మార్గం పొందిన వాడవుతాడు మరెవరిని ఆయన అపమార్గం పట్టిస్తాడో వారే నష్టపోయిన వారవుతారు,అల్-ఆరాఫ్/178].
బాధపడే సమయంలో నీ మంచి కోరే ఒక పెద్దమనిషి వచ్చి బాధపడకు నీకు నేను ఉన్నాను అని ఓదారిస్తే ఎంత బాగా అనిపిస్తుందో,అదే ఈ సమిష్టి లోకాలకు అన్ని తానే అయిన ఆ అల్లాహ్ తన దాసుని సంభోదించి:"నీకు నేను లేనా" అని ప్రశ్నిస్తే ఆ వాక్యాలు విన్న ఆ విస్వాసుని హృదయంలో కలిగే ఆనందానికి హద్దులే ఉండవు.
వ్యాఖ్యానించండి