. గదీర్ సంఘటన పై సాక్ష్యమివ్వని ముగ్గురు వ్యక్తుల పరిస్థితి బలాజరీ పుస్తకం అన్సాబుల్ అష్రాఫ్ లో.
“బలాజరీ” పుస్తకం “అన్సాబుల్ అష్రాఫ్” భాగం1,2 పేజీ152 పై లిఖించబడి ఉన్న కథనం. బలాజరీ ముందుగా హజ్రత్ అలీ(అ.స) ప్రమాణం గుర్తు చేసిన విషయాన్ని ప్రస్తావించారు ఆ తరువాత ఇలా అన్నారు: పీఠం క్రింద “అనస్ ఇబ్నె మాలిక్”, “అల్ బర్రా ఇబ్నె ఆజిబ్” మరియు “జురైర్ ఇబ్నె అబ్దుల్లాహ్ అల్ బిజ్లీ” ఉన్నారు, హజ్రత్ అలీ(అ.స) తన (గదీర్ ఖుమ్ లో దైవప్రవక్త(అ.స) ప్రచారాన్ని విన్న వారు దాని పై సాక్ష్యం ఇవ్వండి అన్న) మాటను మరో సారి చెప్పారు కాని ఆ ముగ్గురిలో నుండి ఒక్కడు కూడా జవాబివ్వలేదు, అప్పుడు హజ్రత్ అలీ(అ.స) ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ ఆ సంఘటన తెలిసి ఉండి కూడా నిరాకరిస్తున్న వాడికి అందరికి తెలిసి వచ్చేటువంటి గుర్తు అతడికి ఇవ్వనంత వరకు ఈ లోకం నుండి తీసుకొని వెళ్ళకు!”. బలాజరీ ఇలా అన్నారు: ఆ తరువాత “అనస్ ఇబ్నె మాలిక్” తెల్లకుష్ఠికి గురయ్యారు, “బర్రా ఇబ్నె ఆజిబ్” గుడ్డివాడయ్యారు, “జురైర్ ఇబ్నె అబ్దుల్లాహ్ అల్ బిజ్లీ” హిజ్రత్ తరువాత ఆరాబీ అయ్యారు మరియు “షర్రాత్”కు వచ్చి తన తల్లి ఇంట్లోనే చనిపోయారు.[అన్సాబుల్ అష్రాఫ్, భాగం1,2 పేజీ152]
రిఫ్రెన్స్
బలాజరీ, అన్సాబుల్ అష్రాఫ్ భాగం1,2 పేజీ152
వ్యాఖ్యలు
సలామ్ మంచి వ్యాసం
వ అలైకుం సలామ్. చాలా ధన్యావాదాలు.
ماشا ء اللہ غدیر کے بارے عمدہ پوسٹ
Shukriya.. Iltemase Dua.
వ్యాఖ్యానించండి