ఖుర్ఆన్ ను పఠించే టప్పుడు పాటించవలసిన కొన్ని నియమాలను ఇమామ్ హదీస్ వివరణ.
ఖుర్ఆన్ పారాయణం గురించి ఖుర్ఆన్ ఇలా వివరిస్తుంది: “మేము ఎవరికి గ్రంథం వొసగామో వారు దానిని పారాయణం చేయవలసిన రీతిలో పారాయణం చేస్తారు. (అంతేకాదు) వారు ఈ గ్రంథాన్ని విశ్వసిస్తారు. ఇక, దీనిపట్ల తిరస్కార వైఖరిని అవలంబించినవారే నష్టపోయేది”[బఖరహ్:121].
ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స] ఖుర్ఆన్ పారాయణం యొక్క నియమాలను వివరిస్తూ 8 విషయాలు సూచించారు: 1. ఆగి ఆగి మెల్లగా(స్పష్టంగా) పఠించాలి 2. ఆయత్ల ఉపదేశాలను గ్రహించాలి 3. ఆయత్లను అమలు పరచాలి 4. అల్లాహ్ చేసిన ప్రమాణాల(వఅదహ్) పట్ల ఆశ కలిగి ఉండాలి 5. భయబోధ(వయీద్) పట్ల భయం కలిగి ఉండాలి 6. సంఘటనల నుండి గుణపాఠం 7. అల్లాహ్ ఆదేశాలను నిర్వర్తించాలి 8. అల్లాహ్ నిషేదాలను విడవాలి, హదీస్ చివరిలో ఇమామ్ ఇలా అన్నారు: పారాయణం కేవలం ఆయత్లను కంఠస్థం చేయడం, అక్షరాలను చదవడం, కాదు.[దఖాయిఖీ బా ఖుర్ఆన్, పేజీ14.]
రిఫ్రెన్స్
మొహ్సిన్ ఖిరాఅతీ, దఖాయిఖీ బా ఖుర్ఆన్, ముఆవినతె ఫర్హంగీ వ ఇజ్తిమాయియె సాజ్మానె ఔఖాప్ వ ఉమూరె ఖైరియహ్, చాపె సివ్వుమ్, 1392.
వ్యాఖ్యానించండి