జిల్ ఖఅదహ్ మాసం 25వ తేదిన అల్లాహ్ భూమిని పరిచాడు అన్న విషయం పై సంక్షిప్త వివరణ.
కరుణామయుడైన అల్లాహ్ “జిల్ ఖఅదహ్” మాసం యొక్క 25 తారీఖున “కాబహ్” నేలను విస్తరించాడు. భూమి అల్లాహ్ యొక్క పవిత్ర గృహం యొక్క కారుణ్యం ద్వార ప్రాణం పొందడానికి, దానిని భూమి పొరలలో ఉంచాడు. ఆరు రోజుల తరువాత అల్లాహ్ శక్తి యొక్క కాంతి భూమి పై పడింది, మెల్లమెల్లగా నేల వ్యాపించడం మొదలయ్యి తన అస్తిత్వాన్ని అల్లాహ్ ఆజ్ఞలో చాటుకుంది. “దహ్ఉల్ అర్” నాడు సృష్టితాలు కరుణామయుడైన అల్లాహ్ యొక్క స్తుతి మరియు ప్రార్థనలలో లీనమయ్యేందుకు మరియు హజ్రత్ ఆదమ్[అ.స] సంతానం వినయవిధేయతలతో మట్టి పై సాష్టాంగం చేసేందుకు, భూమి అల్లాహ్ ఆజ్ఞతో సుఖశాంతుల ఒడిగా నిర్ధారించబడింది. నిస్సందేహముగా విశ్వాసుల నాయకుడు, దైవప్రవక్త[స.అ] యొక్క అసలైన ఉత్తరాధికారి యొక్క జన్మస్థలం, హజ్రత్ ఆదమ్[స.అ]కు శరణాలయంగా నిలిచిన నిలయం, హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] ద్వార నిర్మించబడి మరియు కాబాలో జన్మించిన ఆ పవిత్రుని కుమారుడు తన అదృశకాలాన్ని పూర్తి చేసుకొని వచ్చే నేల నుండే భూమి సృష్టించబడింది.
వ్యాఖ్యలు
Masha Allah
Shukriya, Iltemaase Dua.
వ్యాఖ్యానించండి