.ఆయతుల్లాహ్ సీస్తానీ(అల్లాహ్ అతనిని కాపాడుగాక) యొక్క తౌజీహుల్ మసాయిల్ లో చెప్పబడిన ఫత్వా ప్రకారం జనాబత్ సమయంలో మక్రూహ్ అంశాలు.
మనిషి జనాబత్ స్థితిలో ఉన్నప్పుడు తొమ్మిది అంశాలు అతడి పై మక్రూహ్ గా నిర్ధారించబడ్డాయి. అవి:
1,2. తినడం, త్రాగడం; కాని ముఖం, చేతులు కడుక్కోని పుక్కిలింత చేసుకుంటే (తినడం త్రాగడం) మక్రూహ్ కాదు. ఒకవేళ కేవలం చేతులు మాత్రమే కడుక్కుంటే మక్రూహ్ ప్రభావం కొంచెమే తగ్గుతుంది.
3. ఖుర్ఆన్ యొక్క వాజిబ్ సజ్దహ్ లేని ఆయతులు కాకుండా 7 కన్నా ఎక్కువ ఆయత్లు చదవడం.
4. ఖుర్ఆన్ యొక్క అట్ట, అక్షరాలు లేని ఖాలి చోటు మరియు ఆయతుల వరుసలలో ఉన్న ఖాలీ చోటును తాకడం.
5. ఖుర్ఆన్ ను తోడుగా పెట్టుకోవడం.
6. పడుకోవడం; కాని ఒకవేళ ఉౙూ చేసుకుంటే లేదా నీరు లేకపోవడంతో తయమ్ముమ్ చేసుకుంటే మక్రూహ్ కాదు.
7. తలను గోరింటాకు లేదా దానివలే వేరే వాటితో రంగు వేసుకోవడం.
8. శరీరానికి నూనె రాసుకోవడం.
9. నిద్రలో వీర్యం బయటకు వచ్చిన తరువాత స్ర్తీ సంభోగం చేయడం.[తౌజీహుల్ మజాయిల్, పేజీ74]
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి