హజ్రత్ ఇజ్రాయీల్[అ.స] అనగా మృత్యుదూత, మలకుల్ మౌత్; వారి గురించి సంక్షిప్త వివరణ.
హజ్రత్ ఇజ్రాయీల్[అ.స] అల్లాహ్ యొక్క నాలుగు ప్రముఖ దూతలలో ఒకరు. వారిని “మలకులే మౌత్” అనగా మృత్యుదూత అని కూడా అంటారు. ఖుర్ఆన్ యొక్క సూరయే సజ్ దహ్ 11వ ఆయత్ లో అల్లాహ్ ఇలా ప్రవచించెను: (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీపై నియమించబడివున్న మృత్యుదూత మీ ప్రాణాలను వశరిపరచుకుంటాడు. ఆ తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకు మరలించబడతారు”[సజ్దహ్:11].
ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను: ‘మలకుల్ మౌత్’ ఇలా ప్రశ్నించబడ్డారు: “కొందురు పడమరాన ఉంటారు మరి కొందరు తూర్పున ఉంటారు, వారి ప్రాణాలను ఒకే సమయంలో ఎలా తీయగలవు?” ‘మలకుల్ మౌత్’ ఇలా సమాధానం ఇచ్చారు: “నేను ఆత్మలను పిలుస్తాను అవి నా ఆదేశాన్ని విని నా వద్దకు వస్తాయి. ప్రపంచం నా చేతుల్లో మీ చెంతుల్లో ఉండే కంచం లాంటిది మీకు ఇష్టమైన వాటిని దాని తీసుకొని తింటారు, నా ముందు ప్రపంచం కూడా అలాంటిదే ఎటు నుండి ఏది కావాలంటే అటు వైపు త్రిప్పుతాను”
సంక్షిప్తంగా చెప్పాలంటే అల్లాహ్ హజ్రత్ ఇజ్రాయీల్[అ.స]కు సమయానికి వారి పని పూర్తి చేసేందుకు ఆ శక్తులు ప్రసాదించాడు.[ఫరిష్తగాన్, పేజీ101].
రిఫ్రెన్స్
అలీరిజా రిజాలీ తెహ్రానీ, ఫరిష్తగాన్.
వ్యాఖ్యానించండి