ప్రపంచంలో ముస్లిములందరు నమాజు చేస్తారు కానీ ఎలాంటి నమాజు ఆ దేవుని సన్నిధిలో స్వీకరింపబడుతుంది అన్నదానికి జవాబు ఆ మహాప్రవక్త(స.అ.వ) లేదా వారి ఉత్తరాధికారులే చెప్పగలరు.
నమాజు గురించి మహాప్రవక్త(స.అ.వ) తాకీదులు:
1.ఎప్పుడైతే మనిషి నమాజు కోసం నిలబడతాడో,ఒక వేళ అతని పూర్తి శ్రద్ధ మరియు హ్రుదయం ఆ అల్లాహ్ వైపే ఉంటే ఎప్పుడైతే అతని నమాజు పూర్తవుతుందో అతను ఆ రోజే పుట్టిన వాని మాదిరి(అంటే అతని అన్ని పాపాలు క్షమింపబడ్డాయి అని అర్ధం).
2.ఎవరైతే రెండు రకాతుల నమాజు చేస్తారో మరియు ఆ నమాజులో తన హ్రుదయాన్ని పూర్తిగా లోకసంబంధమైన వ్యవహారాలకు దూరంగా ఉంచి(పూర్తి శ్రధ్ధతో) చేస్తారో,ఆ అల్లాహ్ వారి అన్ని పాపాలను క్షమిస్తాడు.
3.రెండు రకాతుల నమాజు పూర్తి ధ్యాసతో మరియు హ్రుదయాన్ని ఆ అల్లాహ్ సన్నిధిలో హాజరు చేసి చేయబడినదో ఆ నమాజు రాత్రంతా మేల్కొని పరధ్యానంతో చేసిన నమాజు కన్నా చాలా విలువైనది.
4.ఎవరైతే ఇతర మగ లేదా ఆడవారి వీపు వెనుక వారి చెడీలు చెప్తారో నలభై రోజుల వరకు వారి నమాజు మరియు వారి ఉపవాసం స్వీకరింపబడదు,కానీ వారు ఎవరి గురించి చాడీలు చెప్పారో వారు క్షమిస్తే గానీ(వారి నమాజు,ఉపవాసాలు స్వీకరింపబడవు).
రెఫరెన్స్
మొహ్జతుల్ బైజా,1వ భాగం, పేజీ నం:382. బిహారుల్ అన్వార్, 84వ భాగం, పేజీ నం:249, మీజనుల్ హిక్మహ్, 5వ భాగం, పేజీ నం:390, బిహారుల్ అన్వార్,75వ భాగం, పేజీ నం:258.
వ్యాఖ్యానించండి