.ఇమాం(అ.స)ల వారి ఈ హదీసు అనుసారంగా క్షమాగుణం కలిగిన వారు స్వర్గమునకు నిజమైన అర్హులు.
ఇమాం సజ్జాద్(అ.స)ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: ప్రళయదినాన మానవులు ఆ మైదానంలో గుమిగూడటం జరుగుతుంది అప్పుడు "దయామహులు ఎక్కడ ఉన్నారు?" అని ఒక పిలుపు వస్తుంది,మనుష్యుల యొక్క ఒక సమూహము నిలబడటం జరుగుతుంది,"స్వర్గంలోకి ప్రవేశించండి" అని సంభొదించటం జరుగుతుంది.
అప్పుడు దైవదూతలు ఆశ్చర్యపోయి మీరు ఎవరు?ఎక్కడకు వెళుతున్నారు?అని ప్రశ్నిస్తారు. దానికి జవాబిస్తూ మేము ఇతరులపై దయచూపేవారము స్వర్గము వైపునకు వెళుతున్నాము అని అంటారు,దానికి దైవదూతలు మీ దయాగుణం భూలోకంలొ ఏ విధంగా ఉండేది?అని ప్రశ్నిస్తారు,వారు మాపై దౌర్జన్యం జరిగినప్పుడల్లా మేము ఆ దౌర్జన్యము చేసిన వారిని క్షమించి వదిలివేసేవాళ్ళము అని అంటారు. దైవదూతలు వారితో మీరు స్వర్గములోకి ప్రవేశించండి మీరు ఈ ఒక్క గుణంలో శ్రేష్టులు మరియు ఉత్తములు ఎందుకంటే మీరు ఆ దేవుని యొక్క ఈ ఉత్తమమైన గుణాన్ని(క్షమించే గుణాన్ని) కలిగి ఉన్నవారు (మీరు స్వర్గానికి అర్హులు) అని అంటారు.
రెఫరెన్స్: దాస్తాన్ హాయి అజ్ ఖుదా,అహ్మద్ మీర్ ఖలఫ్ జాదె.
వ్యాఖ్యానించండి