ఇస్లాం యొక్క సిధ్ధాంతాల పట్ల నిర్లక్ష్యమే ముస్లిముల వెనుకుబాటుతనానికి కారణం అని చెప్పవచ్చు.ఒక వేళ దాని ఆదేశాలను పాఠించి ఉంటే ఇప్పుడు వారి పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు.
అన్ని ధర్మాలలో కెల్లా అత్యుత్తమమైన ధర్మం ఇస్లాము అని మరియు అల్లహ్ వద్ద గల ఏకైక ధర్మము కూడా ఇస్లామేనని దివ్యఖురాను చెబుతుంది.కానీ ఇంత మంచి ధర్మాన్ని కలిగి ఉండి కూడా ముస్లిములు ఎందుకు వెనుకబడి ఉన్నారు?దానికి కారణము ఎవరో కాదు ఇస్లామును తన ధర్మంగా,దైవప్రవక్త అనుచరుడిగా,ఇస్లాము సిధ్ధాంతాలు పాఠించేవానిగా చెప్పుకునే ఈ ముస్లిమే దీనికి కారణం అని చెప్పవచ్చు.ఎందుకంటే ఈ ముస్లిమే ఇస్లాము చూపించే సన్మార్గము నుంచి దారితప్పి తాను స్రుష్టించుకున్న నామమాత్రపు ఇస్లాము యొక్క ఆచరణను మొదలుపెట్టాడు, ఇస్లాము కొరకు మరియు ఇతర ముస్లిముల కొరకు ప్రాణాన్నిచే దైవప్రవక్త మరియు వారి ఉత్తరాధికారులైన ఇమాములు మరియు వారి సహాబీయులైన సల్మాను,అబూజర్,మిఖ్దాద్ లాంటి వారిని అనుసరించటాన్ని వదిలి కేవలం తమ మంచిని మాత్రమే కోరుకుని ఇస్లాము ప్రతిష్టతను భ్రష్టు పట్టించిన ఉమయ్య మరియు బనీ అబ్బాస్ ఖలీఫాల మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇస్లాము సిధాంతాలను పక్కన పెట్టి,దైవప్రవక్తల వారి అనుచరణను విస్మరించి తనకు లాభదాయకంగా ఉండే సిధ్ధాంతాలను ఎంచుకున్నాడు.ఏ ముస్లిముల కొరకు ఈ దైవగ్రంధం అవతరింపబడినతో దాని ఆచరణలను మరియు దాని సిధ్ధాంతాలను ఇతరులు అనుసరించటం మొదలు పెట్టారు అదే వారి ఉన్నతికి కారణమైంది.ఇస్లాము సమస్త మానవాళికి మార్గదర్శనం చేయటం కొరకే పంపబడినది కానీ దానిని అనుసరించే వారికే అది సన్మార్గాన్ని చూపుతుంది అది ముస్లిములైతే నేమి కాక పోతే నేమి.
రెఫరెన్స్: అజ్ తూ సవాల్ మీకునంద్,అయతుల్లాహ్ మకారిం షిరాజి,పేజీ నం:29.
వ్యాఖ్యలు
Mashallah
వ్యాఖ్యానించండి