ఖుస్రో పర్వేజ్ అన్న రాజు మరియు ఒక సాధారణ వ్యక్తి మధ్య అపశకునం పై జరిగిన సంభాషణ.
“ఖుస్రో పర్వేజ్” అనే రాజు అడవికి వేటకు వెళ్ళాడు, అడవికి చేరగానే ఒక అసహ్యకరమైన ముఖంగల వ్యక్తి ఎదురుపడ్డాడు, దాన్ని అతడు అపశకునంగా భావించి ఆ వ్యక్తిని అక్కడ నుండి దూరంగా తీసుకెళ్ళండి అని ఆదేశించాడు.
అతడు “ఖుస్రో పర్వేజ్, ప్రపంచ చిత్రకారుడ్ని(సృష్టికర్తని) నిందిస్తున్నాడు” అని మనసులో అనుకున్నాడు.
ఖుస్రో పర్వేజ్ వేట నుండి తిరిగి వస్తుండగా అదే ప్రదేశంలో మరలా ఆ వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి, ఓ ఖుస్రో! నాదొక ప్రశ్న? అన్నాడు. అడుగు అన్నాడు. ఆ వ్యక్తి “స్వామీ! ఈరోజు మీ వేట ఎలా ఉండింది?” అని ప్రశ్నించాడు. దానికి ఆ రాజు “చాలా చాలా బాగా జరిగింది” అని సమాధానమిచ్చాడు. “మీతో వచ్చినవారికి ఎదైనా హాని కలిగిందా?” అని అడిగాడు. లేదే అని రాజు సమాధానిచ్చాడు. “అయితే ఎందుకని నన్ను చూసి అపశకునం అని నన్ను అవమానించి మీ దారి నుండి నన్ను దూరం చేశారు?” అని అడిగాడు. దానికి రాజు “నీలాంటి వారిని చూడడం అపశకునమని ప్రజలు అంటూ ఉంటారు” అని సమాధానమిచ్చాడు.
ఆ వ్యక్తి “అలాగైతే నన్ను చూడడం ఖుస్రోకు అపశకునం కాలేదు, ఖుస్రోను చూడడం నాకు అపశకునం అయ్యింది” అన్నాడు.
ఖుస్రో ఆ వ్యక్తి చెప్పిన మాటను అంగీకరించి, క్షమాపణ కోరాడు.[ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, భాగం2, పేజీ164].
రిఫ్రెన్స్
సయ్యద్ అలీ అక్బర్ సదాఖత్, ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్, ఇంతెషారాతె తహ్జీబ్, చాప్4, 1387.
వ్యాఖ్యలు
Jazakallah
Inshallah...
Shukriya..
Masha Allah
Shukriya.. Jazakallah
వ్యాఖ్యానించండి