మంగళ, 07/23/2019 - 18:02
పుణ్యకార్యాల్తో పాటు హరాముకు దూరంగా ఉంటేనే స్వర్గము ప్రాప్తిస్తుంది.
దైవప్రవక్త ముహమ్మద్[స.అ]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: “ప్రళయదినాన ఒక సమూహాన్ని తీసుకురావటం జరుగుతుంది. వారి పుణ్యకార్యాలు పర్వతాల మాదిరి ఎంతో పెద్దవిగా ఉంటాయి, కానీ భగవంతుడు వారి పుణ్యకార్యాలను నాశనం చేస్తాడు. మరియు వారిని నరకానికి తీసుకుపొమ్మని ఆదేశిస్తాడు”. ఇది విన్న సల్మాన్ “ఓ మహనీయ ప్రవక్తా! ఈ సమూహములో ఉన్నవారెవరు?” అని ప్రశ్నించారు. దానికి ప్రవక్తలవారు “వీరు రోజా ఉంటారు, నమాజులు చేస్తారు, రాత్రులను ప్రార్ధనలలో గడుపుతారు, కానీ ఎప్పుడైనా తమ ముందు హరామును చూస్తారో దాని వైపు మొగ్గుచూపుతారు” అని అన్నారు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా హరాముకు దూరంగా ఉండకపోతే స్వర్గము ప్రాప్తించనట్లే.
రెఫరెన్స్
మనాబె ఫిఖ్ హే షీయా,22వ భాగము,పేజీ నం:317.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి