అల్లాహ్ తరపు నుండి అవతరింపబడ్డ అంతిమ పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ మజీద్ గురించి సంక్షిప్త వివరణ...
అల్లాహ్ తరపు నుండి అవతరింపబడ్డ అంతిమ గ్రంథం. దానిని అల్లాహ్ తన అంతిమ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా[స.అ] యొక్క మోజిజా(అద్భుతకృత్యం)గా నిర్ధారించి అవతరింపజేశాడు. అందులో 114 సూరహ్ లు ఉన్నాయి. ప్రతీ సూరహ్ “బిస్మిల్లాహ్”తో మొదలవుతుంది ఒక్క “బరాఅత్” సూరహ్ తప్ప.
ఖుర్ఆన్ యొక్క పూర్తి జ్ఞానం కేవలం దైవప్రవక్త[స.అ] మరియు వారి అహ్లెబైత్[అ.స]లకు మాత్రమే ఉంది. వారికి తప్ప మరెవ్వరికీ ఖుర్ఆన్ యొక్క సంపూర్ణ జ్ఞానం లేదు.
ఉజూ లేకుండా ఖుర్ఆన్ యొక్క అక్షరాలను తాకడం నిషిద్ధం(హరామ్). ఖుర్ఆన్ కరీమ్ లో నాలుగు ఆయతలు ఉన్నాయి అవి పఠించడం లేదా వినటం ద్వార వెంటనే సజ్దా చేయటం వాజిబ్ అవుతుంది. ఆ నాలుగు ఆయతులు 12వ, 24వ, 27వ మరియు 30వ పారహ్ లలో ఉన్నాయి.
ఇది చాలా గొప్ప గ్రంథం, ఈనాటి వరకు ప్రజలందరూ కలిసి దానికి జవాబు తీసుకొని రాలేకపోయారు మరియు అంతిమ దినం వరకు కూడా తీసుకొని రాలేరు.
రిఫ్రెన్స్
ఇమామియా దీనియాత్, తన్జీముల్ మకాతిబ్, దరజయే దువ్వుమ్.
వ్యాఖ్యానించండి