కంఠస్వరం దైవప్రవక్త[స.అ] కంఠస్వరానికి మించకూడదు అని ఆదేశిస్తున్న ఆయత్ ఆధారంగా సహాబీయుల అసభ్య ప్రవర్తన ఎంత వరకు సమంజసం...
సహాబీయులందరూ దైవప్రవక్త[స.అ] పట్ల విధేయత చూపేవారు అని నమ్మే వారు హుదైబియహ్ సంఘటనను మొదటి సారి విన్నప్పుడు లేక చదివినప్పుడు, వారికి సహాబీయులు దైవప్రవక్త[స.అ] పట్ల ఇంత అసభ్యత మరియు అమర్యాదగా ప్రవర్తించగలరా? అని అస్సలా నమ్మలేరు. ఒకవేళ ఈ సంఘటన కేవలం షియా ముస్లింల పుస్తకాలలో ఉండివుంటే వెంటనే సహాబీయుల పై నింద అని అనేస్తారు. కాని ఈ సంఘటన ఎంత ప్రఖ్యాతి చెందిన మరియు సరైనది అంటే అహ్లెసున్నత్ మరియు షియా హదీస్ ఉల్లేఖించువారందరూ, ఉల్లేఖించారు. ఏ విషయం పై బెఅసత్ నుండి హుదైబియహ్ సంధి వరకు ఇరవై సంవత్సరాలు దైవప్రవక్త[స.అ] వద్ద ఉన్నటువంటి సహాబీయుల తరపు నుండి ఎటువంటి సాకును తీసుకొని రాగలము. వాళ్ళు తమ కళ్ళతో దైవప్రవక్త[స.అ] సృష్టించిన అధ్భుతాలను చూశారు. రాత్రింబవళ్ళు ఖుర్ఆన్, వాళ్ళకు దైవప్రవక్త[స.అ]తో ఎలా వుండాలో, ఎలా మాట్లాడాలో నేర్పించింది. చివరికి అల్లాహ్, “ఒకవేళ మీ కంఠస్వరం దైవప్రవక్త[స.అ] కంఠస్వరానికి మించినట్లైతే మీరు చేసుకున్నదంతా వ్యర్ధమౌతుంది” అని హెచ్చరించాడు.
వ్యాఖ్యానించండి