దైవప్రవక్త[స.అ] వ్రాయాలనుకున్నదాన్ని ఉమర్ తో పాటు ఇతర సహాబీయులు కూడా పసిగట్టారు...
దైవప్రవక్త[స.అ] కలం మరియు కాగితం అడికి ఏమి వ్రాయాలనుకుంటున్నారో కేవలం ఉమర్ మాత్రమే పసిగట్టలేదు, అక్కడున్న వాళ్ళలో చాలా మంది ఉమర్ ఎదైతే అనుకున్నారో అదే అనుకున్నారు. ఎందుకంటే దైవప్రవక్త[స.అ] ఇంతకు ముందే “నేను మీ మధ్య రెండు అమూల్యమైన వస్తువులను వదిలి వెళ్తున్నాను అందులో ఒకటి అల్లాహ్ గ్రంథం రెండవది నా ఇత్రత్ నా అహ్లెబైత్[అ.స], నా తరువాత వీళ్ళతో కలిసున్నంత వరకు (నా తరువాత వీళ్ళను విడవనంత వరకు) మార్గభ్రష్టులు కారు” అని సెలవిచ్చారు. చివరి నిమిషంలో కూడా ఇంచుమించు అదే చెప్పారు “మార్గభ్రష్టులు కాకుండా ఉండేందుకు ఒక లేఖనం వ్రాస్తాను” అని. ఉమర్తో పాటు అక్కడున్న అందరికి దైవప్రవక్త[స.అ] గదీర్ మైదానంలో ప్రకటించిన విషయాన్నే ఇప్పుడు అల్లాహ్ గ్రంథం మరియు అహ్లెబైత్[అ.స]ను వదలకుండా పట్టుకొని ఉండమని లిఖించి వాజిబ్ చేయాలని అనుకుంటున్నారు అని అర్ధమైయ్యింది.
అహ్లెబైత్[అ.స]లలో ప్రముఖులు హజ్రత్ అలీ[అ.స] అంటే ఇంకో విధంగా ఖుర్ఆన్ మరియు అలీ[అ.స]ను వదలకండి అని సెలవిస్తున్నారన్నమాట.
వ్యాఖ్యానించండి