అందుకే పశ్చాత్తాపానికి కారణమయ్యే పాపము మానవునిలో స్వార్ధాన్ని నింపే సత్కార్యం కన్నా మేలైనది.
ఇమాం అలి[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “నిన్ను కలత పెట్టే చెడ్డ పని నిన్ను స్వార్ధపరునిగా మరియు గర్విష్టిగా చేసే మంచి పని కన్నా మేలైనది”.మానవునిలో సజీవంగా ఉన్న మనస్సాక్షి అతనిని చెడు కార్యముల నుండి ఆపుతుంది.ప్రకృతి పరంగా,స్వాభావిక పరంగా చూస్తే ఈ బ్రతికున్న మనస్సాక్షే అతనిని దుర్మార్గాములనుండి సన్మార్గాన్ని వేరు చేసి చూపిస్తుంది మరియు చెడు కార్యముల నుండి దూరంగా ఉండమని హెచ్చరిస్తుంది.వేరే వైపు చూస్తే కొంత మంది తాము చేసిన సత్కార్యములపై గర్విస్తూ మాకన్నా మంచి పనులు చేసే వారు ఎవరుంటారు? అని అనుకుంటారు.అలాంటి స్వభావం ఉన్న వాళు ఎప్పుడూ దైవమార్గంలో ఉన్నతశిఖరాలకు చేరుకోలేరు. ఎందుకంటే మంచి పనులు చేసిన వారి గర్వమే వారిని నాశనం చేయగలదు వేరేవైపు పాపములు చేసినా పాశ్చత్తాప్పడే వారి పశ్చాత్తాపము వారిని అల్లాహ్ కారుణ్యానికి అర్హులను చేయగలదు.
రెఫరెన్స్: నెహ్జుల్ బలాఘా,హిక్మత్ నం: 46.
వ్యాఖ్యానించండి