ఇరాన్ స్వాతంత్ర్యం తరువాత ఇరాఖ్ తో జరిగిన యుద్ధంలో ఇరాన్ విజయానికి ముఖ్య పాత్రధారులలో ఒకరు సూలైమానీ...
ఇరాన్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, వారు పని చేసుకుంటూనే కిర్మాన్ లో ఉన్న “సిపాహె ఇఫ్తెఖారీ” సమూహానికి సభ్యుడయ్యారు. వారే స్వయంగా “విప్లవం కోసం శ్రమించాము, అందుకని ఆర్మీలో ప్రవేశించాను” అని అన్నారు. కాలం గడిచింది సులైమానీ కిర్మాన్ లో ఉన్న “ఖుద్స్” సైనికశిబిరానికి కమాండర్ అయ్యారు. ఇరానీ సంవత్సరం 1359, షహ్రీవర్ నెలలో ఇరాన్ మరియు ఇరాఖ్ మధ్య యుద్ధం మొదలయ్యింది, అప్పుడు వారు కిర్మాన్ లో కొన్ని బెటాలియన్స్ ను ట్రైనింగ్ ఇచ్చి దక్షిణ యుద్ధభూమికి పంపేవారు. వారు శత్రుసైన్యానికి అడ్డుగోడగా నిలిచేవారు, వాళ్లను ముందుకు రాకుండా ఆపేవారు, కొత్తగా ఆలోచించేవారు. ఈ విషయాలే ఖాసిమ్ సులైమానీ ఉనికి యొక్క ప్రభావాన్ని ఆ 8 సంవత్సరాల యద్ధంలో చూపించింది; ఉదాహారణకు “వల్ ఫజ్ర్”, “కర్బలా4”, “కర్బలా5”, “తక్ షలమ్చ” ఆపరేషన్స్ లో.
ఆ యుద్ధం అనంతరం, తన సైన్యంతో కిర్మాన్ కు తిరిగి వచ్చి తూర్పు నుండి ముఖ్యంగా అఫ్గానిస్తాన్ వైపు నుండి ప్రవేశిస్తున్న శత్రువులతో యుద్ధాన్ని సాగించారు.
రిఫ్రెన్స్
తహ్లీలియె ఖబరియె అస్రె ఇరాన్/ హౌజా నెట్.కామ్
వ్యాఖ్యానించండి