జన్నతుల్ బఖీ గోపురాలు మరియు సమాధులు ఎప్పుడ నాశనం చేయబడ్డాయి అన్న విషయం పైసంక్షిప్త వివరణ...
చరిత్ర మరియు దర్శనానికి వెళ్ళిన వారి మాటల ఆదారంగా జన్నతుల్ బఖీలో దైవప్రవక్త[స.అ] యొక్క సమాధుల పై రౌజా మరియు గోపురాలు ఉండేవి. అంతేకాకుండా హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యొక్క జ్ఞాపకార్థం అయిన “బైతుల్ హుజ్న్” కూడా ఉండేది. వలసరాజ్య కుట్ర ఫలితంగా పుట్టుకొచ్చిన సౌదీ అధికారం వహాబీ వర్గ నమ్మకాలను అనుసరిస్తూ ఈ పవిత్ర దర్బారులను, బార్గాహ్ లను నాశనం చేశారు. ఈ చర్య రెండు సార్లు జరిగింది. మొదటి సారి హిజ్రీ యొక్క 1220వ సంవత్సరంలో మరియు రెండవ సారి 1344లో. మొదటి సారి నాశనం చేసిన తరువాత 1234లో ఉస్మానీ అధికారం యొక్క రాజు సుల్తాన్ మహ్మూద్ సాని ఉత్తర్వులనుసారం వాటిలో కొన్నింటిని మరలా కట్టారు.[ఇన్హెదామె జన్నతుల్ బఖీ, పేజీ12]
రిఫరెన్స్
హమీదుల్ హసన్, ఇన్హెదామె జన్నతుల్ బఖీ; ఎక్ తారీఖీ అలమియ, అర్ష్ అసోసియేషన్, లఖ్నౌ, జులాయి2017.
వ్యాఖ్యానించండి