జన్నతుల్ బఖీ స్మశానాన్ని ఎవరు నాశనం చేశారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
వలస రాజ్య బలగాలు తమ అపవిత్ర లక్ష్యాలను చేరుకోవటం కోసం ఎల్లప్పుడూ ముస్లిముల మధ్య విరుద్ధ మంటను రేపి వారి మధ్య ద్వేషాలను వ్యాపించటంలో మరియు వారిలో వ్యతిరేకత సృష్టించడానికి కొత్త కొత్త నమ్మకాలను మరియు అభిప్రాయలను ప్రయోగిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఇబ్నె తైమియహ్ యొక్క అభిప్రాయాల ఆధారంగా, వహాబీయత్ రూపంలో ఒక కొత్త వర్గాన్ని సృష్టించారు. మొహమ్మద్ ఇబ్నె అబ్దుల్ వహాబ్ అనబడే ఒక యువకుడిని తమ ఈ మిషన్ ను విజయవంతం చేయడానికి ఉపయోగించుకున్నారు. ప్రజల పాలకుడిని అచటి పూర్తి ప్రాంతం పై అధికారం ఆశను చూపించి ఇబ్నె అబ్దుల్ వహ్హాబ్ అనుచరుడ్ని చేశారు. అలా ముస్లిలలో చాలాకాలం వరకు వివాదాలు ఏర్పర్చారు. మొదట్లో ప్రపంచ ముస్లిములందరూ ఈ ఇస్లాంకు ఎటువంటి సంబంధం లేని ఈ అన్యాయ చర్య పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేశారు, ఆ తరువాత మొల్ల మొల్లగా అదికారం ఆధారంగా వహాబీయత్ ను వ్యాపిస్తూ ప్రపంచమంతటా తమ వంటివారిని తయారు చేసుకున్నారు. న్యాయవర్తులైన ముస్లిములు అంతేకాదు ముస్లిం కాని వారు కూడా ఈనాటి వరకు వారు చేసిన ఈ అపవిత్ర చర్యను ఖండిస్తున్నారు.
వహాబీయుల తాయిఫ్, జద్దా, మక్కా మరియు మదీనా యొక్క పవిత్ర ప్రదేశాలే కాకుండా కర్బలా మరియు నజఫ్ లలో కూడా ఇలాంటి చర్యలకు ప్రయత్నాలు చేశారు కాని అచటి అహ్లెబైత్[అ.స]ను ఇష్టపడేవారి ధైర్యం మరియు వారి ఎదురు దాడి ముందు నిలబడలేకపోయారు.[ఇన్హెదామె జన్నతుల్ బఖీ, పేజీ14]
రిఫరెన్స్
హమీదుల్ హసన్, ఇన్హెదామె జన్నతుల్ బఖీ., ఎక్ తారీఖీ అలమియ, అర్ష్ అసోసియేషన్, లఖ్నౌ, జులాయి2017.
వ్యాఖ్యానించండి