దైవప్రవక్త[స.అ] ప్రవచనం.. “సత్యం విషయంలో మౌనం, షైతాన్ ప్రసాదించిన మూగతనం”
దైవప్రవక్త[స.అ] ప్రవచనం.. “సత్యం విషయంలో మౌనం, షైతాన్ ప్రసాదించిన మూగతనం”
ఒకవేళ ఇమామ్ అలీ[అ.స], తన ఖిలాఫత్ హక్కు విషయంలో మౌనంగా ఉండీ, ఇస్లాం మరియు ముస్లిముల లాభాన్ని ఆలోచించకుండా ఉంటే, ఇస్లాం, హజ్రత్ ముహమ్మద్[స.అ] అనంతరం అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] అనుకున్నట్లు ఏమాత్రం మిగిలి ఉండేది కాదు. ఈ యదార్ధం చాలా మందికి తెలియదు. అందుకనే ఇలా వాదిస్తూ ఉంటారు: “అబూబక్ర్ మరియు ఉమర్ల ఖిలాఫత్ సరైనది; ఎందుకంటే అలీ[అ.స] వాళ్ళ పట్ల మౌనంగా ఉన్నారు. అంటే అతను ఇష్టపడేవారన్నమాట”. మరి ఇలా కూడా వాదిస్తూ ఉంటారు: “ఒకవేళ దైవప్రవక్త[స.అ] అలీ[అ.స]ని తన తరువాత ఖలీఫాగా నియమించి ఉంటే, హజ్రత్ అలీ[అ.స]కు మౌనంగా కూర్చునే హక్కు లేదు; ఎందుకంటే ఖిలాఫత్ అతని యొక్క హక్కు.
తన ఆశలకు మరియు కోరికలకు అనుగుణంగా ఉండేవాటినే “యదార్ధం” అని భావించేవాడి, వాదనలివి. అతడు మౌనంలో ఉన్న ఫలితాన్ని మరియు చాలా కాలాం వరకు పొందేలాభాన్ని, గుర్తించలేడు. అతడికి ఈ లాభాలను త్వరగా అంతమయ్యే లాభాలతో పోలిస్తే, ఎక్కువ సమయం మరియు చాలా విశాలత్వం కలిగి ఉంటుంది, అనే జ్ఞానం లేదు. ముఖ్యంగా ఎప్పుడైతే అసత్యానికి సహకరించేవారు ఎక్కువగా ఉంటారో, అప్పుడు వెంటనే వాళ్ళతో పోట్లాడడం చాలా తక్కువ లాభాన్ని తెచ్చిపెడుతుంది. మౌనం మరియు నిలకడ ద్వార యదార్థాన్ని తెలిపేందుకు కొంత సమయం పడుతుంది.
వ్యాఖ్యానించండి