గురు, 07/30/2020 - 08:54
ఈద్ రోజు తక్బీర్ చెబుతు ఈద్ గాహ్ కు వెళ్లే సున్నత్ ఎవరిది అన్న విషయాన్ని వివరిస్తున్న రివాయత్...
భారతదేశ రాష్టాలలో కొన్ని పట్టణాలలో ముఖ్యంగా గ్రామాలలో ఈదె పిత్ర్(రమజాన్ పండగ) మరియు ఈదె ఖుర్బాన్(బక్రీద్) రోజున గ్రామస్తులందరూ కలిసి ఒక నిశ్చయ ప్రాంతానికి చేరి అక్కడ నుండి తక్బీర్ చెబుతూ మసీదులకు మరియు ఈద్ గాహ్ లకు నమాజ్ ప్రార్థనుల నిర్వర్తించడానికై వెళ్తారు.
బహుశ ఈకాలం యువకులకు ఈ చర్య ఖలీఫతుల్ ముస్లిమీన్ హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] సున్నత్ అని తెలిసి ఉండదు. రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది: “అలీ[అ.స] ఈద్ రోజు బయటికి వచ్చి తక్బీర్ చెప్పుకుంటూ నమాజ్ ప్రార్థనలు జరిగే స్థలం వరకు వచ్చారు.[మురాఖిబాతె మాహె రమజాన్, పేజీ485]
రిఫరెన్స్
మురఖిబాతె మాహె రమజాన్, మీర్జా జవాద్ మలికి తబ్రేజీ, తర్జుమయె అల్ మురఖిబాతె ఇబ్రాహీమ్ బందర్ రీగీ.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి