హజ్రత్ అలీ(అ.స) ను ఖులఫా-ఎ-రాషిదీన్ లో ఎప్పుడు చేర్చారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
“ఖులఫా-ఎ-రాషిదీన్ (అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్ మరియ అలీ(అ.స)) యొక్క ఖిలాఫత్
ను అంగీకరించే వాళ్లే అహ్లెసున్నత్ అనబడతారు” అని ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. మరి ఈ విషయం ఈనాడు అందరికి తెలిసిందే.
కాని అహ్లెసున్నత్
లు “అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స)”ను ఖులఫా-ఎ-రాషిదీన్ లలో లెక్కించేవారు కాదు. మరి అలాగే అతని “ఖిలాఫత్” షరా పరమైనది, అని కూడా భావించేవారుకాదు, అన్నది కూడా ఒక చేదు నిజం.
అలీ(అ.స) ను చాలా కాలం తరువాత “ఖులఫాయే సలాసహ్” యొక్క బృందంలో కలిపారు. అనగా హిజ్రీ శకం 230వ సంవత్సరంలో “ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్” కాలంలో హజ్రత్ అలీ(అ.స)ను నాలుగోవ ఖలీఫాగా అంగీకరించారు.
షియా కాని సహాబీయులు, ఖులఫాలు, రాజులు మరియు అబూబక్ర్ కాలం అధికారులు చివరికి అబ్బాసీయుల ఖలీఫా ముహమ్మద్ ఇబ్నె అల్ రషీద్ మరియు మోతసిమ్ కాలం యొక్క పాలకులు కూడా కేవలం అలీ(అ.స) యొక్క ఖిలాఫత్
ను అంగీకరిచకపోవడంమే కాకుండా వాళ్ళలో కొందరు అతని పై లఅనత్ చేసేవారు. మరియు అతనిని ఒక ముస్లిం
గా కూడా భావించేవారు కాదు. ఒకవేళ ముస్లిం అని భావించినట్లైతే, మరి పీఠాల నుండి అతని పై ఈ లఅనత్ మరియు దూషణ చేయడానికి అర్ధమేమిటి!!!?
అబూబక్ర్ మరియు ఉమర్, అలీ(అ.స)ను ఖిలాఫత్ మరియు అధికారం నుండి ఎలా దూరంగా ఉంచారో తెలిసిందే. ఆ ఇద్దరి తరువాత ఖిలాఫత్ కుర్చీ పై ఉస్మాన్ కూర్చున్నారు. అతను తన మిత్రుల కన్న ఎక్కువగా అలీ(అ.స)ను అవమానించారు. చివరికి ఒకసారి “అబూజర్” వలే మీకు కూడా పట్టణం నుండి బహిష్కరించబడుతుంది, అని అతనికి హెచ్చరించారు. మరియు అధికారం ముఆవియా చేతుల్లో వచ్చాక అతడు దీనిని ఇంకా వ్యాప్తిని ఇచ్చి అలీ(అ.స) పై లఅనత్ చేయించడం మొదలు పెట్టాడు. ప్రజలను కూడా దూషించడం పై బలవంతం చేశాడు. అలా బనీఉమయ్యాహ్ యొక్క పాలకులందరూ ప్రతీ పట్టణంలో మరియు ప్రతీ గ్రామంలో ఈ చెడు రీతిని మొదలు పెట్టారు. 80 సంవత్సరముల వరకు ఈ క్రమం సాగుతూనే ఉండింది.[1]
అంతేకాదు ఈ లఅనత్, అతని మరియు అతని షియాల నుండి అయిష్టత క్రమం ఇంకా ఎక్కువ కాలం వరకు సాగుతూనే ఉంది. అబ్బాసీయుల ఖలీఫా “ముతవక్కిల్” యొక్క శత్రుత్వం మరియు వైరాన్ని చూడండి; అతడు హిజ్రీ శకం 240వ సంవత్సరంలో “అలీ(అ.స)” మరియు అతని కుమారుడు “హుసైన్(అ.స)” యొక్క సమాధులను త్రవ్వించేశాడు.
తన కాలంలో అమీరుల్ మొమినీన్(గా చెలామణి అయ్యే) అయిన వలీద్ ఇబ్నె అబ్దుల్ మలిక్
ను చూడండి, జుమా రోజున ఉపన్యాసం ఇస్తూ ప్రజలతో ఇలా అన్నారు: దైవప్రవక్త(స.అ) ద్వార ఉల్లేఖించబడే ఈ హదీస్ “(ఓ అలీ(అ.స)!) మూసాకు హారూన్
కు గల సంబంధమే నీకూ నాకూ గల సంబంధం” సరైనదే కాని అందులో లేఖకదోషము గలదు. ఎందుకంటే దైవప్రవక్త(స.అ) అతనిని అభిముఖించి “మూసాకు ఖారూన్
కు గల సంబంధమే, నీకూ నాకూ గల సంబందం” అని అన్నారు. విన్నవాళ్ళు తప్పుగా విన్నారు.[2]
“మోతసిమ్” కాలంలో నాస్తికుల సంఖ్య ఎక్కువగా ఉండేది. అది ధర్మ వేదాంతుల కాలం, “ఖిలాఫతె రాషిదహ్”ల కాలం పూర్తయ్యింది. ప్రజలకు కొత్త కొత్త కష్టాలు ఎదురయ్యాయి. అప్పటి ప్రజలు తమ రాజుగారి మతం
పై నడుస్తున్నారు, మరియు ఖుర్ఆన్
ను “మఖ్లూఖ్” అని అనేవారు. ఇమామ్ అహ్మద్ ఇబ్నె హంబల్ ఖుర్ఆన్
ను “ఖదీమ్” అని నమ్మేవారు అందుకని అతను కొరడాతో శిక్షించబడ్డారు. అలా అహ్మద్ ఇబ్నె హంబల్ భయంతో ఖుర్ఆన్
ను “మఖ్లూఖ్” అని చెప్పి ప్రాణాలు కాపాడుకున్నారు. కాని “ముతవక్కిల్” కాలంలో హంబల్ నక్షత్రం మెరిసింది మరియు అదే కాలంలో హజ్రత్ అలీ(అ.స) ను “ఖులఫాయే సలాసహ్”లలో జోడించారు.[3]
బహుశ “అహ్మద్ ఇబ్నె హంబర్”
కు హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) గురించి ఉల్లేఖించబడిన ఆ హదీసులు ఆశ్చర్యంలో ముంచేసి ఉంటాయి. అహ్మద్ ఇబ్నె హంబల్ ఇలా అన్నారు: “అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) యొక్క ప్రతిష్ఠత క్రమంలో ఉల్లేఖించబడినవన్ని హదీసులు వేరే ఎవ్వరి గురించి ఉల్లేఖించబడలేవు”
రిఫరెన్స్
1. కేవలం ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ తప్ప.
2. తారీఖే బగ్దాద్, భాగం8, పేజీ266.
3. అహ్లె హదీసులు కూడా అహ్లెసున్నత్ వల్ జమాఅత్ యొక్క భాగమే.
వ్యాఖ్యలు
Excellent
వ్యాఖ్యానించండి