దైవప్రవక్త(స.అ) హదీసులను వారి జీవితంలోనే లిఖించేవారు అని నిదర్శించడానికి కొన్ని హదీసులతో పాటు అల్ జామిఅహ్ గ్రంథం కూడా ఒక ముఖ్యమైన నిదర్శనం
దైవప్రవక్త(స.అ) ను సాధారణ మానవుడిగా చూపించడానికి, వారు కూడా పొరపాట్లు చేస్తారు అనే విషయాన్ని నిదర్శుంచడానికి తప్పుడు హదీసుల ప్రదర్శనలతో చాలా ప్రయత్నాలు జరిగాయి. ఉదాహారణకు తాబీరున్నఖ్ల్(కర్జూరం చెట్లకు ఎరువుల) సంఘటన; మరియు హిజాబ్
కు సంబంధించిన ఆయత్ అవతరణ సంఘటన; లేదా కపటవర్తనుల కోసం అస్తగ్ఫార్ చేయడం; బద్ర్ ఖైదీయుల నుండి పరిహారాన్ని అంగీకరించడం. అహ్లెసున్నత్ వల్ జమాఅత్
లు తమ “సహాహ్ గ్రంథా”లలో ఇలాంటివే మరెన్నో సంఘటనలు ఉల్లేఖించారు. వాళ్ళు ముహమ్మద్(స.అ)ను ప్రవక్త అనే నమ్మేవారు కాదు.
దైవప్రవక్త(స.అ) పట్ల విశ్వాసం మరియు రీతి ఇలా ఉన్నప్పుడు మరి వారు “మేము దైవప్రవక్త(స.అ) సున్నత్తో కలిసి ఉన్నాము” అని ఎందుకు వాదిస్తారు. వాస్తవాని కి దైవప్రవక్త(స.అ) యొక్క హదీస్ మరియు సున్నత్ వారూ మరియు వారి పూర్వీకుల వద్ద లేదు. మరియు తెలియదు. ఉల్లేఖించి కూడా లేదే.[1]
ఈ న్యూనమైన ఆలోచనలను మరియు తప్పుడు అభిప్రయాలను, అసత్యంగా చేయడం మన పై విధి. ఇన్
షా అల్లాహ్, మేము “సహాహ్” మరియు వారి ఇతర గ్రంథాల ద్వారానే వారి మాటను రద్దు చేస్తాము.[2]
1. “ఇమామ్ బుఖారీ” తన “సహీ గ్రంథం” యొక్క “కితాబుల్ ఇల్మ్” అను భాగంలో “బాబొ కితాబతుల్ ఇల్మ్” అను అధ్యాయంలో “అబూహురైరాహ్” ద్వార రివాయత్ను ఉల్లేఖించారు, అతను ఇలా అన్నారు: దైవప్రవక్త(స.అ) సహాబీయులలో నా కన్న ఎక్కువ హదీసులు ఎవ్వరికీ గుర్తు ఉండేవి కావు, కాని ‘అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్
’కు నా కన్న ఎక్కవ గుర్తు ఉండేవి, ఎందుకంటే అతను వ్రాసేవారు మరి నేను వ్రాసేవాడిని కాదు.[3]
ఈ రివాయత్ ద్వార దైవప్రవక్త(స.అ) సహాబీయులలో కొందరు, దైవప్రవక్త(స.అ) హదీసులను లిఖించేవారని తెలుస్తుంది. “అబూహురైరహ్” కేవలం విని దైవప్రవక్త(స.అ) యొక్క ఆరువేల హదీసులు ఉల్లేఖించారు, అంటే ఇక “అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ ఇబ్నె ఆస్” వద్ద అయితే వాటి కన్న ఎక్కువ హదీసులు ఉండి ఉంటాయి. ఎందుకంటే అతను (హదీసులను) వ్రాసేవారు. “అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ ఇబ్నె ఆస్
కు నా కన్న ఎక్కువ హదీసులు గుర్తున్నాయి ఎందుకంటే అతను వ్రాసేవారు” అని అబూహురైరహ్ కూడా ఒప్పుకున్నారు. నిస్సందేహంగా ఇంకా చాలా సహాబీయులు దైవప్రవక్త(స.అ) హదీసులు వ్రాసేవారు, కాని అబూహురైరహ్ బహుశ వాళ్ళకు దైవప్రవక్త(స.అ) యొక్క హదీసులు ఎక్కువగా గుర్తున్నాయి అన్న ప్రఖ్యాతి చెందకపోవడం వల్ల ప్రస్తావించి ఉండరు.
అలా హదీసును కాపాడుకున్న వారిలో, మేము “అలీ ఇబ్నె అబీతాలిబ్ (అ.స)”ను కూడా జోడిస్తున్నాము. అతను పీఠం నుండి “అల్ జామిఅ” అను ఒక గ్రంథం గురించి చెప్పేవారు. ఆ గ్రంథంలో ప్రజలకు అవసరం కలిగేటువంటి దైవప్రవక్త(స.అ) హదీసులు ఉండేవి. ఈ గ్రంథం ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)లలో ఒకరి తరువాత ఒకరికి వారసత్వంగా చెందుతూ వస్తుంది. మరియు వారు ఎక్కువగా దాని నుండే హదీసులు ప్రవచిస్తారు.
ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: “మా వద్ద ఒక గ్రంథం ఉంది, దాని పొడవు 70 గజాలు. దీనిని దైవప్రవక్త(స.అ) చెబుతుంటే, అలీ(అ.స) తన చేతితో వ్రాశారు. అన్ని హలాల్, హరామ్ మరియు ప్రజలకు అవసరం వచ్చేటువంటి అన్నీ ఇందులో వ్రాసి ఉన్నాయి. ప్రతీ దానికి పరిష్కారం చివరికి చిన్న గీరుట గురించి కూడా అందులో ఉంది”.[4]
స్వయంగా “బుఖారీ”యే తన పుస్తకంలో “ఈ గ్రంథం గురించి ఈ గ్రంథం అలీ(అ.స) వద్ద ఉండేది” అని ఎన్నో అధ్యాయలలో ప్రస్తావించారు. కాని “బుఖారీ” తన అలవాటు ప్రవకారం ఈ గ్రంథం యొక్క భాగాల గురించి, అధ్యాయాల గురించి మరియు అంశాల గురించి ఏమి చెప్పలేదు.
రిఫరెన్స్
1. ఎందుకంటే దైవప్రవక్త హదీసులు లిఖించడం మరియు సంగ్రహించడం ఉమర్ ఇబ్నె అబ్దుల్ అజీజ్ కాలంలో లేదా ఆ తరువాత జరిగింది. అంతకు ముందు పాలకులు మరియు ఖులఫాలు హదీసులను నిప్పంటించేశారు, మరియు వాటిని ప్రవచించడాన్ని మరియు లిఖించడాన్ని నిషేదించారు.
2. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అహ్లెసున్నత్
లు చాలా హదీసులను తమ పుస్తకాలలో ఉల్లేఖిస్తారు ఐతే వాటికి వ్యతిరేకమైనది కూడా స్వయంగా ఆ పుస్తకంలోనే ఉంటుంది. మరియు దాని కన్న ఎక్కువ ఆశ్చర్యకరమైనదేమిటంటే వీళ్ళు తప్పుడు హదీస్ పై అమలు చేసి సరైన హదీస్
ను వదిలేస్తారు.
3. సహీబుఖారీ, బాగం1, పేజీ36, బాబె కితాబతుల్ ఇల్మ్.
4. ఉసూలే కాఫీ, భాగం1, పేజీ239.
దైవప్రవక్త(స.అ) తమ ఉల్లేఖనలను లిఖించమని ఆదేశించేవారు మరియు వారి హదీసులను లిఖించేవారు అని నిదర్శించడానికి కొన్ని హదీసులతో పాటు అల్ జామిఅహ్ గ్రంథం కూడా ఒక ముఖ్యమైన నిదర్శనం.
వ్యాఖ్యానించండి