ప్రజల జీవితాలు బాగుండాలంటే నాయకుడు న్యాయధర్మాలను పాటించేవాడై ఉండాలి. ఎవడు పడితే వాడు అధికారం పై వచ్చి పాలిస్తానంటే ఇలానే ఉంటుంది...
హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) ఇస్లామీయ అధికారం పొందిన తరువాత, పీఠం పై ఎక్కి అల్లాహ్ ను స్థుతించిన తరువాత ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ సాక్షిగా, మదీనహ్ లో (నాకంటూ) ఒక్క చెట్టు మిగిలి ఉన్నా, నేను బైతుల్ మాల్ (ఇస్లామీయ అధికార ఖజానా) నుంచి ఏదీ తీసుకోను, బాగా గుర్తుంచుకోండి నేను ముస్లిముల ఖజానా నుంచి తీసుకోను అంటున్నాను అంటే మీకు ఎలా ఇవ్వగలను?”
అఖీల్ నిలబడి ఇలా అన్నారు: “మమ్మల్ని మదీనహ్ లో ఉన్న నల్లచర్మం (హబషీయులు) వారితో సమానంగా భావిస్తున్నారా?”
ఇమామ్ ఇలా అన్నారు: “సోదరా కూర్చోండి, నువ్వు కాకుండా ఇక్కడ మాట్లాడడానికి మరొకరు లేరా, నువ్వు ఆ నల్ల చర్మం వారి పై ఎటువంటి ఉత్తమత్వం కలిగిలేవు, ఉత్తమత్వం కేవలం మరియు విశ్వాసం మరియు ధర్మనిష్ట వలనే”
చివరిమాట: ఒక్క సారి ఆలోచించండి; దైవప్రవక్త(స.అ) తరువాత ఇలాంటి న్యాయమూర్తి అయిన హజ్రత్ అలీ(అ.స) ముస్లిముల ఖిలాఫత్ ను పొంది ఉంటే ఈనాడు మన జీవితాలు వేరే విధంగా ఉండేవి.
రిఫరెన్స్
వసాయిల్ అల్ షియా, హుర్రె ఆములీ, భాగం11, పేజీ79.
వ్యాఖ్యలు
Jazakallah
వ్యాఖ్యానించండి