మృత్యువు అనగా ఆత్మ శరీరం నుండి వేరవ్వడం, మరి ఆత్మను శరీరం నుండి వేరు చేసేది ఎవరు అన్న విషయం పై ఖుర్ఆన్ వివరణ.
కొన్ని ఆయతుల ప్రకారం మనిషి యొక్క ఆత్మను శరీరం నుండి ఎలా తీయబడుతుంది? ఎవరు దానిని స్వాధీనం చేసుకుంటారు? ఎవరు దానిని వశపరుచుకుంటారు? అన్న విషయాన్ని పరిశీలించినట్లైతే కొన్ని చోట్లలో అల్లాహ్ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడని, మరి కొన్ని చోట్లలో ఇజ్రాయీల్[అ.స] మరియు కొన్ని చోట్లలో మృత్యుదూతలు అని తెలుస్తుంది.
ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా వివరించెను:
1. అల్లాహ్యే ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు.[జుమర్:42]
2. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీపై నియమించబడివున్న మృత్యుదూత మీ ప్రాణాలను వశపరుచుకుంటాడు. ఆ తరువాత మీరంతా మీ ప్రభువు వైపునకు మరలించబడతారు”.[సజ్దహ్:11].
3. చివరకు మీలో ఎవరికయినా మరణ ఘడియ సమీపిస్తే, మేము పంపిన దూతలు అతని ఆత్మను స్వాధీనం చేసుకుంటారు. (ఈ విధి నిర్వహణలో) వారెలాంటి నిర్మక్ష్యం చేయరు.[అన్ఆమ్:61].
వ్యాఖ్యానించండి