హజ్రత్ సాలెహ్[అ.స] జాతి నాశనం అవ్వడానికి కారణం వారు అల్లాహ్ ఆదేశాలను పాటించకపోవడం. ఇళ్ళలోనే చచ్చిపోయారు.
హజ్రత్ సాలెహ్[అ.స] జాతి వారు, ఆయన దౌత్యంపై సాక్ష్యాన్ని కోరగా అల్లాహ్ పర్వతం నుండి ఒక ఒంటెను పంపాడు. అప్పుడు హజ్రత్ సాలెహ్[అ.స] వారి జాతి వారితో ఇలా అన్నారు: “ఓ నా జాతివారలారా! అల్లాహ్ మీ కోసం ఒక సూచనగా పంపిన ఆడ ఒంటె ఇది. మీరు ఈ ఒంటెను అల్లాహ్ భూమిపై స్వేచ్ఛగా మేస్తూ తిరిగేలా వదిలి పెట్టండి. దానికి ఎలాంటి కీడూ తలపెట్టకండి. మీరు గనక దాని జోలికి పోయారంటే తొందరగానే శిక్ష మీపై విరుచుకుపడుతుంది”[హూద్:64]
అయినా సరే వారు ఆ ఒంటె కాళ్ళను నరికేశారు. అప్పుడు సాలెహ్ “మీరు మీ ఇళ్ళల్లో మూడు రోజుల పాటు ఉండి జీవితాన్ని అనుభవించండి. ఈ వాగ్దానం (నిర్థారిత గడువు) అబద్ధంకానేరదు” అని చెప్పారు.[హూద్:65]
అల్లాహ్ సమూద్ జాతి వినాశం గురించి ఇలా అనెను: “మరి మా ఉత్తర్వు (అమలుపరచబడే సమయం) ఆసన్నమైనప్పుడు మేము సాలెహ్ ను, అతనితో పాటు విశ్వాసులను మా కారుణ్యంతో కాపాడాము. ఆ దినపు అవమానం నుంచి కూడా వారిని రక్షించాము. ఇకపోతే దుర్మార్గులను భయంకరమైన అరుపు ఒకటి కబళించింది. దాంతో వారు తమ ఇళ్ళల్లోనే సాగిలపడి (చచ్చి)పోయారు. అసలు వారెప్పుడూ అక్కడ నివసించనే లేదన్నట్లుగా! తెలుసుకోండి! సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు. తెలుసుకోండి! సమూద్ జాతివారు (దైవకారుణ్యానికి) దూరం చేయబడ్డారు”.[హూద్:66-68].
వ్యాఖ్యలు
Mashallah
Shukriya... jazakallah
వ్యాఖ్యానించండి