ఒక విశ్వాసి మరియు కపటవర్తనుడి మధ్య తేడ ఏమిటు అన్న విషయం పై హదీస్ వివరణ.
నాలుక మనిషి యొక్క భాగ్యాన్ని నిర్ణయించే విషయంలో మఖ్యపాత్ర వహిస్తుంది. దీని ప్రభావం ప్రతీ విషయంలో ఉంటుంది, అది కుటుంబానికి సంబంధించినవి కానివ్వండి, సమాజానికి కానివ్వండి లేదా అది ధర్మానికి సంబంధించినది కానివ్వండి. నిజానికి ప్రతీ జగడం వెనక మన నోరే ముఖ్య పాత్రను వహిస్తుంది. అందుకనే మౌనం మనిషికి మంచిది. రివాయతులలో కూడా మౌనం యొక్క చాలా లాభాలు సూచించబడి ఉన్నాయి. దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: "నీకు మౌనంగా ఉన్న ఒక విశ్వాసి కనిపిస్తే అతడికి దగ్గర అవ్వు, దాంతో అతడు నీకు జ్ఞానం ఇస్తాడు, (ఎందుకంటే) విశ్వాసి తక్కువ మాట్లాడతాడు మరియు ఎక్కువ అమలు చేస్తాడు, కపటవర్తనుడు ఎక్కువగా మాట్లాడతాడు మరియు తక్కువ అమలు చేస్తాడు"[ముహద్దిసే నూరీ, ముస్తద్రికుల్ వసాయిల్, భాగం9, పేజీ18]. ఎక్కువ మాట్లాడడం కఠోరహృదయానికి కారణం అవుతుంది. ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: “హజ్రత్ ఈసా[అ.స] ఇలా ఉల్లేఖించారు: “అల్లాహ్ స్మరణ తప్ప ఎక్కువ మాట్లడకు ఎందుకంటే అల్లాహ్ తప్ప వేరే విషయాలలో ఎక్కువగా మాట్లాడే వారి హృదయాలు వారికి తెలియకుండానే కఠోరమవుతాయి”[ఉసూలే కాఫీ, భాగం2, బూబుస్సమ్త్ వ హిఫ్జుల్లిసాన్, హదీస్11].
రిఫ్రెన్స్
ఉసూలె కాఫీ మరియు ముస్తద్రికుల్ వసాయిల్
వ్యాఖ్యలు
Mashallah
Shukriya... jazakallah...
The best quote I have ever read
Alhamdulillah.... Iltemase dua.
వ్యాఖ్యానించండి